నల్లగొండ : ముఖ్యమంత్రి సహాయనిధితో పేద వర్గాలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పేద వర్గాల వారు కార్పొరేట్ ఆస్పత్రుల్లో లక్షలకు లక్షలు వెచ్చించి వైద్యం చేయించుకొని ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి వారికి కొంత ఆర్థిక ఉపశమనం కలిగిస్తుందన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ వైద్యకళాశాల, నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక స్కానింగ్, డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించామన్నారు. పేదలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, మార్కెట్ చైర్మన్ బొర్ర సుధాకర్, కనగల్ ఎంపీపీ కరీం పాషా, సీనియర్ నాయకులు కటికం సత్తయ్య గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు పిల్లి రామరాజు యాదవ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, వంగాల సహదేవరెడ్డి, నల్గొండ, తిప్పర్తి, కనగల్ మండల పార్టీ అధ్యక్షులు, దేప వెంకట్ రెడ్డి, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి , అయితగొని యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
చైత్రను హతమార్చిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి
కొవిడ్-19 : భారత్లో ఆ వేరియంట్లను గుర్తించలేదు
Priyanka Vadra : అసెంబ్లీ బరిలోకి ప్రియాంకగాంధీ వాద్రా!