తెలంగాణలో అమలవుతున్న పథకాలు పక్క రాష్ర్టాల్లో కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నందుకే టీఆర్ఎస్ను సీఎం కేసీఆర్ బీఆర్ఎస్గా మార్చారన్నారు. పార్టీ పేరు మారినా గుర్తు మారలేదు.. గులాబీ రంగు మారలేదు.. కారు మారలేదు.. కలర్ మారలేదని తెలిపారు. వ్యవసానికి సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుంటే.. కేంద్రంలోని మోదీ సర్కారు మోటర్లకు మీటర్లు పెట్టి బిల్లు వసూలు చేయాలని చూస్తున్నదని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీటర్లు పెట్టబోమని సీఎం కేసీఆర్ మోదీ ప్రభుత్వానికి జవాబు ఇచ్చారని చెప్పారు.
అదానీకి దోచిపెట్టే ప్రయత్నంలో భాగంగానే కరంట్, పెట్రోల్, డీజిల్, కూరగాయల ధరలు పెంచారని విమర్శించారు. దేశ ప్రజలకు మంచి చేయడానికే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలకు వెళ్తున్నారని చెప్పారు. సమావేశంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు, పార్టీ మండలాధ్యక్షుడు ఎస్ఏ రజాక్, ఎంపీపీ గుడ్ల ఉపేంద్రావెంకన్న, జడ్పీటీసీ కన్న సురాంబవీరన్న, వైస్ ఎంపీపీ బెజ్జెంకి శ్రీరాంరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి సూరినేని నర్సింహారావు, నాయకులు దుగ్యాల రవీందర్రావు, కపోతంరెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, ఉప్పలయ్యగౌడ్, మధుసూదన్, ఉపేందర్రెడ్డి, రమేశ్, నరేశ్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగేంధర్రావు అన్నారు. మహిళలకు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. మహిళల బాధలు తీర్చడానికి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారన్నారు. షీటీమ్ ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పిస్తున్నారని తెలిపారు. అంతకుముందు పార్టీ శ్రేణులు మహిళలు, కోలాటాలు, చిడుతల భజనలు, డప్పుచప్పుళ్లు, బోనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కళాకారుల ఆటాపాట ఉత్సాహపరిచాయి.