చిట్యాల, ఏప్రిల్ 21 : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు దేశానికి ఆదర్శకంగా నిలిచిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంజూరైన వారికి అద్దాలను అందజేసి మాట్లాడారు. కంటి వెలుగు పథకంపేదలకు గొప్ప వరమని, తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నదన్నారు. రైతులకు రైతుబంధు, రైతుబీమా అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. కార్యక్రమంలో. ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు, పొలగోని స్వామి, కంచర్ల జన్నారెడ్డి, ఉయ్యాల నరేశ్ పాల్గొన్నారు.