‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ పాలన అందిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాజనీతిని కనబరుస్తూ పని చేస్తే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో నిరూపించారు. నేడు సబ్బండ వర్గాల జీవితాల్లో వెల్లివిరుస్తున్న సుఖసంతోషాలే ఇందుకు నిదర్శనం. సీఎం కేసీఆర్ దార్శనిక పాలన, ప్రగతి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు వచ్చింది. వివిధ పథకాల అమలుతో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రంలో వేల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలమయ్యాయి. ’ అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా నల్లగొండ కలెక్టరేట్లో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తొమ్మిదేండ్లలో జిల్లాలో జరిగిన ప్రగతి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
నల్లగొండ, జూన్ 2 : సీఎం కేసీఆర్ దార్శనిక పాలన, ప్రగతి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజా జీవితాల్లో గుణాత్మక మార్పు వచ్చిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమాల్లో తెలంగాణ దేశానికే రోల్మోడల్గా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా కలెక్టరేట్లో శుక్రవారం ఆయన జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఉదయాదిత్య భవన్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతి, చేసిన అభివృద్ధి, వాటి ఫలితాలు, జిల్లాలో వచ్చిన మార్పులు, చేపట్టిన పథకాల గురించి వివరించారు.
తెలంగాణ రాష్ట్రమేర్పడ్డాక ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ పాలన సాగిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో తెలిపేందుకు తెలంగాణ ప్రగతి ఒక కొలమానమని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణలో వేలాది గ్రామాల బీడు, చివరి భూములకు సైతం గోదావరి జలాలు అందుతున్నాయన్నారు. వ్యవసాయ రంగంలో అభివృద్ధి దేశానికి దిక్సూచిగా మారిందనడంలో సందేహం లేదన్నారు. దేశంలో ఎకడా లేని విధంగా అత్యాధునికమైన పోలీస్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా పోలీసు కంట్రోల్ టవర్ నిర్మించినట్లు తెలిపారు. 125 అడుగుల అంబేదర్ విగ్రహ ఏర్పాటు, తెలంగాణ అమరవీరుల స్తూపం, అత్యాధునిక హంగులతో నిర్మించిన తెలంగాణ సచివాలయం వంటి చారిత్రక నిర్మాణాలు ఈ దశాబ్ద కాలంలో తెలంగాణ సాధించిన అభివృద్ధికి సూచికంగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నల్లమోతు భాస్కర్రావు, రమావత్ రవీంద్రకుమార్, నోముల భగత్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి, ఎస్పీ అపూర్వరావు, అదనపు కలెక్టర్లు ఖుష్బూ గుప్తా, భాస్కర్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఆర్డీఓ జయచంద్రారెడ్డి పాల్గొన్నారు. దశాబ్ద కాలంలో జిల్లా సాధించిన ప్రగతి శాఖల వారీగా వివరించారు.
వ్యవసాయ రంగం…
సీఎం కేసీఆర్ చేపట్టిన రైతుబంధు పథకం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. 2018 వానాకాలం నుంచి 2022 యాసంగి (10 సీజన్లకు) రైతుబంధు పథకంతో నల్లగొండ జిల్లాలో 4,83,179 మంది రైతులకు రూ.5243.99కోట్లు అందించింది. రైతు బీమా పథకం 2018లో మొదలైనప్పటి నుంచి ఏప్రిల్-2023 వరకు జిల్లాలో 6256మంది రైతు కుటుంబాలకు రూ.312.80కోట్లు అందించింది. 2014-23వరకు రైతుల నుంచి 63 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.10,879కోట్లు చెల్లించింది. జిల్లాలో 140 క్లస్టర్ గ్రామాల్లో రూ.30.80కోట్లతో 140 రైతు వేదికలు నిర్మించింది. ఆయిల్ పామ్ సాగు ప్రోత్సహానికి 1022మంది లబ్ధిదారులకు రూ.6.94కోట్ల రాయితీ అందించింది. రూ.56కోట్లతో 92,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 27 గోదాములు నిర్మించింది. నకిరేకల్ మండలంలోని చీమలగడ్డ ప్రాంతంలో రూ.3.58కోట్లతో నిమ్మ మారెట్, పీఏపల్లి మండలంలోని కోన మేకలవారిగూడెంలో రూ.60.50లక్షలతో దొండ మారెట్ నిర్మించింది. నల్లగొండ మారెట్లో రైతు బజార్, బత్తాయి మారెట్ నిర్మించగా క్రయ విక్రయాలు జరుగుతున్నాయి.
నీటి పారుదల రంగం..
రూ.2433.69కోట్లతో ఎఎమ్మార్ఎస్ఎల్బీసీ సొరంగం-1, 2 తవ్వకపు పనులు చేయగా మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి. పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ జలాశయ నిర్మాణం అంచనా విలువ రూ.578.30కోట్లకు గాను రూ.170.60కోట్లతో పనులు పూర్తి చేశారు. ఉదయ సముద్రం లిఫ్టు ఇరిగేషన్ పథకాన్ని పూర్తిచేశారు. ఈ మధ్యలో ట్రయల్ రన్ ద్వారా బ్రాహ్మణవెల్లెంల రిజర్వాయర్ను నింపారు. జిల్లాలో వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి.
సంక్షేమంపై ప్రత్యేక దృష్టి..
జిల్లాలో 4,66,529 కుటుంబాలకు ప్రతి నెలా 8,962 మెట్రిక్ టన్నుల సబ్సిడీ బియ్యం పంపిణీ చేస్తున్నది. ఆసరా పథకంతో 2,12,663 మంది లబ్ధిదారులకు రూ.2,809 పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దళితబంధు పథకం కింద 517 కుటుంబాలకు గాను రూ.51.70కోట్లతో స్వయం ఉపాధి పథకాలతో గ్రౌండింగ్ పూర్తి చేశారు. పశు సంవర్దక శాఖతో 65,384మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమం మన జిల్లా నుంచే ప్రారంభించడం గర్వకారణంగా పేర్కొన్నారు. అదేవిధంగా మత్య్సకారులు, చేనేత, గీత కార్మికుల సంక్షేమనాకి కృషి చేస్తున్నది. దసరా పండుగ ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేస్తున్నారు. ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి సాయం అందిస్తున్నారు. నాయీ బ్రాహ్మణులు, రజక వృత్తిదారులకు ఉచిత కరెంట్ అందిస్తున్నది.
పల్లెలు, పట్టణాభివృద్ధికి
తెలంగాణకు హరితహారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అటవీ శాఖల ఆధ్వర్యంలో 8 విడతలుగా 2.05కోట్ల మొక్కలు నాటారు. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా మొదటి విడుతగా జిల్లాలో 517పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారు. కంటి వెలుగు కార్యక్రమంతో జిల్లాలో 7,24,689 మందికి స్రీనింగ్ చేసి 98,732 మందికి దగ్గరి చూపు అద్దాలు, 56, 669 మందికి దూరపు చూపు అద్దాలు అందించారు. ప్రతి జిల్లాకు ఒక వైద్యకళాశాల ఏర్పాటులో భాగంగా 2018లో నల్లగొండలోని గంధంవారిగూడెం రోడ్, ఎస్.ఎల్.బి.సి. నందు 42 ఎకరాల భూమి కేటాయించి 275 కోట్ల రూపాయలతో వైద్య కళాశాల పనులు ప్రారంభించి పనులు పురోగతిలో ఉన్నాయి. జిల్లా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు జిల్లా వ్యాప్తంగా 5 వేల జనాభా కలిగిన 195 ఉప ఆరోగ్య కేంద్రాలను పల్లె దవాఖానాలుగా అభివృద్ధి చేశారు. ఐదు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారు.
రహదారుల అభివృద్ధి,
పలు కార్యాలయాల నిర్మాణాలు
జిల్లాల రహదారుల అబివృద్ధికి ప్రభుత్వం ఈ తొమ్మిదేండ్లలో వేల కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసింది. జాతీయ రహదారి నంబర్ 565 నకిరేకల్ నుంచి నాగార్జునసాగర్ వరకు, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు, సింగిల్ రోడ్డు నుంచి డబల్ రోడ్డు 9 నిర్మాణ పనులు, రూ.46.37కోట్లతో 14 బ్రిడ్జిలు, రూ.5కోట్లతో ఐదు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు నిర్మించారు. జిల్లా వివిధ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు.
యువత ఉపాధి కల్పనకు ఐటీ, టీఎస్ఐపాస్లు
రాష్ట్రం జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ చట్టం విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది. పరిశ్రమల స్థాపనకు సంబంధించిన అనుమతులు ప్రక్రియ అత్యంత సులభతరంగా మారింది. 24గంటల విద్యుత్, మెరుగైన శాంతి భద్రతలు, స్థిరమైన, సమర్థవంతమైన పరిపాలన నెలకొన్నందున జాతీయ అంతర్జాతీయ స్థాయి దిగ్గజ సంస్థలు తెలంగాణకు తరలివస్తున్నాయి. జిల్లాలో టీఎస్, ఐపాస్తో 720 యూనిట్లు భౌతికంగా మంజూరు చేయబడి మొత్తం 30,160 కోట్ల పెట్టుబడిని పొంది, ఇందులో 55 పరిశ్రమలు అన్ని అనుమతులు పొంది ఉత్పత్తిని ప్రారంభించాయి. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి కల్పించే నిమిత్తం రూ.74కోట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రాంగణం నల్లగొండ నందు ఐటీ టవర్ నిర్మాణం జరుగుచున్నది.
ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శనలు
తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందంగా జిల్లా వ్యాప్తంగా ఆయా విద్యా సంస్దల నుండి విద్యా శాఖ ఆద్వర్యంలో తెలంగాణ నేపద్యంలో పలు పాటలకు నృత్య ప్రదర్శన చేశారు. నాగార్జున సాగర్ బాలభవన్ విద్యార్దినులు..జయ జయహే తెలంగాణ జననీ జయకేతనంతో పాటు పలుగురాల్లు అనే జానపదానికి నృత్యప్రదర్శన చేయగా నల్లగొండ విద్యార్దినులు…. రేలా రేలారేతో పాటు అసైదుల్లా హారతీ కాళ్ల గజ్జల గమ్మతి, ఇదేరా తెలంగాణ సకల జనుల కలయిక అనే పాటలకు నృత్య ప్రదర్శన చేయగా వారికి బహుమతులు అందచేశారు. అదే విదంగా ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ పేరుతో నిర్వహించిన క్రీడల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు పలు ఆటల్లో విజేతలుగా నిలవటంతో వారికి సైతం ఇక్కడే బహుమతులు అందచేశారు. రాష్ట్ర స్దాయిలో నిర్వహించిన ఈ పోటీల్లో నల్లగొండకు కబడ్డీ, వాలిబాల్ క్రీడల్లో బాలికలు గోల్డ్ మెడల్ సాదించగా, ఫుట్బాల్లో సిల్వర్ మెడల్ సాదించారు. ఇక బాలురు కబడ్డీలో బ్రాంజ్ సాదించగా 54,60 కిలోల వెయిట్ లిఫ్ట్ంగ్లో ముఖేష్ సిల్వర్, విష్ణువర్దన్ బ్రాంజ్ మెడల్ సాదించటంతో వారికి సైతం మెడల్స్తో పాటు సర్టిఫికెట్స్ అందచేశారు.