యాదగిరిగుట్ట, మార్చి 2 : కొండెక్కిన గ్యాస్ ధరలు దిగిరావాలంటూ గ్యాస్ సిలిండర్కు పూజలు.. రోడ్డుపై కట్టెలపొయ్యితో వంటలు.. తదితర వినూత్న నిరసనలతో యాదగిరిగుట్ట పట్టణం నిరసన సెగలతో అట్టుడికింది. సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్పై రూ.50, కమర్షియల్ సిలిండర్పై రూ.350 పెంచుతూ కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గురువారం పట్టణంలో బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు భారీగా పాల్గొన్నారు. వైకుంఠ ద్వారం వద్ద వంటావార్పు నిర్వహించారు. గ్యాస్ సిలిండర్కు పూల దండలు వేసి పూజలు చేశారు. ఇకనైనా కొండెక్కిన ధరలు దిగిరావాలంటూ మహిళలంతా వేడుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్గౌడ్, వైస్ చైర్మన్ కాటం రాజు, కౌన్సిలర్లు గుండ్లపల్లి వాణి, గౌలికార్ అరుణ, ఆవుల మమత, కో ఆప్షన్ సభ్యురాలు గోర్ల పద్మ, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్గౌడ్, నాయకులు గుండ్లపల్లి భరత్గౌడ్, సడుగు శ్రీనివాస్రెడ్డి, కాంటేకార్ పవన్, ముక్యర్ల సతీశ్ యాదవ్, లఖాన్ పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట పట్టణంలో సీపీఐ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మోదీ ప్రభుత్వంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కళ్లెం సంపత్, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి బండి జంగమ్మ అన్నారు. నిరుపేద కుటుంబాలకు వంటగ్యాస్ ధర పెనుభారంగా మారిందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సభ్యుడు బబ్బూరి శ్రీధర్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు పేరబోయిన పెంటయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆలేరు : పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా ఆలేరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళలతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, వైస్ చైర్మన్ మొరిగాడి మాధవీవెంకటేశ్గౌడ్, బీఆర్ఎస్ పట్టణ, మండలాధ్యక్షులు పుట్ట మల్లేశ్గౌడ్, గంగుల శ్రీనివాస్, మహిళా అధ్యక్షులు క్యాసగల్ల అనసూయ, సీస మహేశ్వరి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళ, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మొరిగాడి ఇందిర, మహిళలు విజయ, భాగ్య, సువర్ణ, అరుణ, భాగ్య
యాదగిరిగుట్ట రూరల్ : గ్యాస్ ధరల పెంపుతో పేదలపై పెనుభారం పడుతుందని ఉప సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు రేపాక స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. రూ.400 ఉన్న గ్యాస్ ధర రూ.1200 పెంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కార్పొరేట్ వర్గాల అభ్యున్నతికి కొమ్ముకాస్తున్న బీజేపీకి చరమగీతం పాడాలని పేర్కొన్నారు.
రాజాపేట : మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు గ్యాస్ బండలతో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, బీఆర్ఎస్ నాయకులు బెడిదె వీరేశం, జెల్ల భిక్షపతిగౌడ్, గుర్రం నర్సింహులు, మోత్కుపల్లి నవీన్కుమార్, రాపోలు లక్ష్మారెడ్డి, కిషన్, కాకల్ల ఉపేందర్, రాములునాయక్, లక్ష్మణ్నాయక్. చెరుకు కనకయ్య పాల్గొన్నారు.
గుండాల : కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు పెంచడం హేయమైన చర్య అని ఎంపీపీ తాండ్ర అమరావతీశోభన్బాబు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఖలీల్లు అన్నారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక మహిళలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై కట్టెల పొయ్యి వెలిగించి గ్యాస్ బండలతో నిరసన తెలిపారు. అనంతరం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు దార సైదులు, మాజీ జడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి, సింగిల్విండో డైరెక్టర్ కొమురయ్య, బీఆర్ఎస్ నాయకులు ప్రకాశ్, అంజిరెడ్డి, రంగారెడ్డి, శ్రీనివాస్గౌడ్, శ్రీనివాస్, రాంమల్లు, సురేందర్రెడ్డి, కొండల్రావు, మహోదయ్, మొగులాల్, నాగరాజు, మల్లయ్య, గణేశ్, రంజిత్రెడ్డి, మల్లారెడ్డి, సాయి, కాశయ్య పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) : మండల కేంద్రంలోని మోత్కూర్ భువనగిరి ప్రధాన రోడ్డుపై కట్టెల పొయ్యిపై వంట చేస్తూ గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తుర్కపల్లి : మండల కేంద్రంలోని చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు వంట గ్యాస్ సిలిండర్లతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నరేందర్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ బీకూనాయక్, ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పత్తిపాటి మంజుల, బద్దూనాయక్, బీఆర్ఎస్ మండల సెక్రటరీ జనరల్ శ్యాగర్ల పరమేశ్, మహిళా అధ్యక్షురాలు శోభ, కో ఆప్షన్ సభ్యుడు రహమత్ షరీఫ్, ఎంపీటీసీ గిద్దె కర్ణాకర్, సర్పంచులు, నామసాని సత్యనారాయణ, రామోహన్శర్మ, మల్లప్ప, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మోటకొండూరు : పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు బొలగాని నాగమణి డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మహిళలు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు భూమండ్ల సుధీర్, ఆలేరు మారెట్ డైరెక్టర్ అనంతుల జంగారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బాల్ద లింగం, గ్రామ ప్రధాన కార్యదర్శి బొలగాని మోహన్గౌడ్, మండల యూత్ ప్రధాన కార్యదర్శి దడిగె మధు, నాయకులు శ్రీనివాస్, అనంతరెడ్డి, నాగరాజు, రాజమ్మ, పోచమ్మ పాల్గొన్నారు.
బొమ్మలరామారం : బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు మన్నె శ్రీధర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుషంగల సత్యనారాయణ, బీఆర్ఎస్ మండల కార్యదర్శి శ్రీకాంత్, యువజన విభాగం అధ్యక్షుడు మెగావత్ జైపాల్, గ్రామశాఖ అధ్యక్షుడు కుక్కదువ్వు ఉపేందర్, ఉప సర్పంచ్ జూపల్లి భరత్, నాయకులు రాంరెడ్డి, మహేశ్, పాండు, పాపిరెడ్డి, వెంకటేశ్, శ్రీనునాయక్ పాల్గొన్నారు.
కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సాధారణ ప్రజలకు సైతం నిత్యావసరాల ధరలు అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గతంలో రూ.400 ఉన్న సిలిండర్ ధర బీజేపీ అధికారంలోకి వచ్చాక రూ.1,200 పెరిగిందని, మహిళలంతా కలిసి బీజేపీ సర్కారును తరిమికొట్టడం ఖాయమన్నారు. నోట్ల రద్దు పేరుతో పేదల నుంచి కోట్ల రూపాయలు దోచ్చుకున్నారని ఆరోపించారు. రూ.12 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన విజయ్ మాల్యా, నీరవ్మోదీలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుండటం దారుణమన్నారు. దేశంలోనే రాష్ర్టాన్ని అభివృద్ధిలో నంబర్వన్గా నిలిపిన సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ప్రజలంతా ఆశిస్తున్నట్లు తెలిపారు.
రూ. లక్షల కోట్లను కొల్లగొట్టిన బడాబాబులను వదిలిన ప్రధాని మోదీ గ్యాస్ ధరలు పెంచి నిరుపేదలపై ప్రతాపం చూపుతున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి మండిపడ్డారు. జన్ధన్ ఖాతాల్లో వేస్తానన్న రూ.15 లక్షలు ఎక్కడపోయాయని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కడిచ్చారో చెప్పాలన్నారు. ఇటు పేదళ్లను, అటు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. పెంచిన ధరలు దించకపోతే దేశవ్యాప్తంగా మహిళల నుంచి నిరసన తప్పదని హెచ్చరించారు.