దేవరకొండ, మార్చి 11 : ఎంపీ బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే తెలంగాణలో తిరుగనివ్వమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మహిళలతో కలిసి పట్టణంలో శనివారం ర్యాలీ తీసి దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం మాట్లాడుతూ బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్నారు. తెలంగాణ మహిళా సమాజాన్ని కించపరిచేలా మాట్లాడడం తగదని హెచ్చరించారు.
మహిళలను గౌరవించలేని అధ్యక్షుడు ఉండడం తగదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్యాదవ్, మహిళా అధ్యక్షురాలు చెరుపల్లి విజయలక్ష్మి, పొన్నబోయిన భూదేవీసైదులు, తస్కినాసుల్తానా, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేశ్గౌడ్, వైస్ చైర్మన్ రహత్ అలీ, రాజు, కృష్ణ పాల్గొన్నారు.