నిడమనూరు, నవంబర్17: పైరవీకారుల కాం గ్రెస్ పార్టీ కావాలా.. రైతుల మేలు కోరే బీఆర్ఎస్ కావాలో.. ప్రజలే ఆలోచించుకోవాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. శుక్రవారం మండలంలోని సూరేపల్లిలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవల్లి విజయేందర్రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు మహిళలు కోలాట నృత్యం, డప్పు చప్పుళ్లతో ఎదురేగి హారతిచ్చి తిలకం దిద్ది ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ని యోజకవర్గం అభివృద్ధికి నోచుకోక వెనుకబాటుకు గురైందన్నారు. బీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాతనే నాగార్జునసాగర్ ప్రగతి బాట పట్టిందని తెలిపా రు.
ఉప ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో చేపట్టిన అభివృద్ధి ప్రజల కండ్ల ముందు ఉందన్నారు. పదహారున్నరేండ్లు మం త్రిగా పనిచేసిన జానారెడ్డి అధికారం అనుభవించి హైదరాబాద్కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశా రు. అధికారంలో ఉన్నన్నాళ్లు జానారెడ్డి సామాన్యులను కలవలేదని ఆరోపించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తున్న తనను మరో మారు ఆశీర్వదించాలని కోరారు. నెల్లికల్ లిఫ్ట్, నందికొండ, హాలియా మున్సిపాలిటీలు, డిగ్రీ కళాశాల ఏర్పాటు ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజలు పోల్చుకోవాలని సూచిం చారు. రాష్ట్రం బాగుండాలంటే సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు.
హాలియా: సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నా రు. శుక్రవారం అనుముల మండలం కొట్టాల, చల్మారెడ్డిగూడెం, నాయుడుపాలెం, హజారి గూడెం, మాదారిగూడెం, పేరూరు, వీర్లగడ్డతండా, కొరివేనిగూడెం, పంగవానికుంట, పంగవాని కుంటతండా, కొత్తపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ నియోజకవర్గ వెనుకబాటుకు జానారెడ్డి, కాంగ్రెస్ పార్టీయే కారణమని తెలి పారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు, తాగు, సాగునీరు రాక ప్రజలు ఇబ్బందులు పడలేదా అని ప్రశ్నించారు. జానారెడ్డికి, ఆయన కుమారుడికి పదవి వ్యామోహం, అధికార దాహం తప్ప నియో జకవర్గంపై ఒక విజన్ లేదని ఎద్దేవా చేశారు.
జానారెడ్డి గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రిగా ఉండి కూడా ప్రజలు తాగేందుకు నీటిసౌకర్యం కల్పించలేక పోయారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎవరెన్ని కుట్రలు చేసినా గెలు పు బీఆర్ఎస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చే ఆరు గ్యారెం టీలకు వారంటీ లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ గెలిస్తే ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాలను పెంచడంతో పాటు సౌభాగ్యలక్ష్మి, రైతుబంధు పెంపు, రూ.400కే గ్యాస్, రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం వంటి పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష అని ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. కల్లబొల్లి మాటలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసగించేందుకు వస్తుందని హెచ్చరించారు. అధికారం కోసం వెంపర్లాడుతున్న కాంగ్రెస్ను చిత్తుగా ఓడించి బీఆర్ఎస్కు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. సబ్బం డ వర్గాల కోసం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిన బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తున్న కాంగ్రెస్ని ప్రజలు నిలదీయాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు.
ఎంపీపీ సుమతిపురుషోత్తం, హాలియా మార్కెట్ చైర్మన్ వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు సత్యపాల్, వెంకటేశ్వర్లు, స ర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు డేవిడ్, వెనిగండ్ల ఎంపీటీసీ చింతమల్ల ప్రమీలావెంకన్న, మాజీ ఎంపీపీ ఏడుకొండల్, ఎంపీటీసీ ఉర్లగొండ వెంకటయ్య, బూత్ కమిటీ ఇన్చార్జి నేతాల వెంకటేశ్వర్లు, రావుల అంజయ్య, జానపాటి సైదయ్య, అంబటి కిరణ్, మారయ్య, మల్లెపల్లి నర్సయ్య, ఆవుల కోటేశ్వరరావు, రావుల వెం కటయ్య, జానపాటి వెంకటయ్య, కొండేటి వెం కన్న, నాగరాజు, కొండేటి సుమంత్, మార్కెట్ డైరెక్టర్ పోశం శ్రీని వాస్గౌడ్, శ్రీనివాసరెడ్డి, సురభిరాంబాబు, ఆవుల వెంకటయ్య, సైదులు, బెడుదూరి వెంకట్రెడ్డి, చేగొండి కృష్ణ, అంజత్ఖాన్, అజ్గర్, మక్బూల్, పద్మవెంకటేశ్వర్లు, సైదులు తదితరులు ఉన్నారు.
గుర్రంపోడు: రాష్ట్రంలో తొమ్మిదిన్నరేండ్లలోనే ఎంతో అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని బ్రహ్మణగూడెం గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 20 కుటుంబాలు గ్రామ శాఖ అధ్యక్షుడు కట్టెబోయిన రాంబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భగత్ కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే భగత్ బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.పార్టీలో చేరిన వారిలో ముంగి శ్రీకాంత్, ముంగి నితిన్, కట్టెబోయిన రవి, పగడాల సతీష్, కుంటిగోర్ల మహేష్, మర్రి నాగరాజు, కుంటి గోర్ల లక్ష్మణ్, రావుల వెంకనన్న, మర్రి నాగరాజు, కుంటిగోర్ల ఆనంద్ ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భగత్మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ది చెందు తాయని తెలిపారు. 60 ఏండ్లు రాష్ర్టాన్ని పరిపాలించిన నాయకులు ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు మరోమారు కేసీఆర్ ప్రభుత్వాన్ని అశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వైస్ ఎంపీపీ రామేశ్వరీధనంజయ్ పాల్గొన్నారు.