ఆత్మకూరు(ఎం), నవంబర్ 14 : 2014 నుంచి నేటి వరకు ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలందరికి అందుబాటులో ఉండి అండగా నిలిచానని.. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశానని.. మరోసారి అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని రాయిపల్లి, సర్వేపల్లి, తిమ్మాపురం, కామునిగూడెం, మొరిపిరాల, కాల్వపల్లి, సింగారం, మోదుగుకుంట, చిన్నగూడెం, ఆత్మకూరు(ఎం)లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో ఆత్మకూరు(ఎం) మండలం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సహకారంతో అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలో 2014కు ముందు 27వేల ఎకరాలు మాత్రమే సాగు కాగా.. నేడు 2లక్షల 16వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు.
మండలానికి సాగు నీరును అందించడానికి నిర్మించిన పునాదిగాని కాల్వ ద్వారా గోదావరి జలాలు అందిస్తామన్నారు. మూడోసారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఓడించి 24గంటల ఉచిత కరెంట్ను అందిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలతో పాటు ఎన్నికల మ్యానిపేస్టోను బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సుధగాని హరిశంకర్గౌడ్ మాట్లాడుతూ ఆలేరు ఎమ్మెల్యేగా గొంగిడి సునీతామహేందర్రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తున్నారని సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలందరూ స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎల్డీఏ చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీసు చందర్గౌడ్, సెక్రటరీ జనరల్ పంజాల వెంకటేశ్గౌడ్, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి, జిల్లా డైరెక్టర్లు కొరె భిక్షపతి, బీసు ధనలక్ష్మి, కేహెచ్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కొప్పుల హరిదీప్రెడ్డి, ఎంపీటీసీలు యాస కవిత, సత్యనారాయణ, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రమేశ్గౌడ్, సర్పంచ్లు సుమతి, ఎల్లయ్య, తిరుమల్రెడ్డి, నాయకులు అరుణ, శంతన్రాజు, నాగరాజు, అజీమ్మొద్దీన్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.