Raveendra Kumar | చందంపేట (దేవరకొండ), ఫిబ్రవరి 7: గత బీఆర్ఎస్ హయాంలోనే దేవరకొండ అభివృద్ధి చెందిందని నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శనివారం దేవరకొండ పట్టణంలోని 12 ,14 ,13,18,19 వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని దేవరకొండ అభివృద్ధి చెందిందని అన్నారు.
దేవరకొండలో ప్రతి వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ, పైపులైన్ పనులు జరిగాయని అన్నారు. అందుకని ఈ నెల 11వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఏ ఒక్క హామీ అమలు కాలేదని అన్నారు. ఓటు వేసే సమయంలో ఒకసారి ఆలోచించి మనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఓటర్లను కోరారు.
బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు గెలుపు కోసం ప్రతీ ఒక కార్యకర్త పనిచేయాలని అన్నారు. దేవరకొండ ఖిల్లా మీద మరోసారి గులాబీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కేతావత్ భిల్య నాయక్, రమేష్ నాయక్, కిషన్ నాయక్, ఆంజనేయులు, హరి నాయక్, మంజు నాయక్, రూపాల నాయక్, రవి కుమార్, భవానీ, బాబా, అంజి గౌడ్ రాజు, కృష్ణ, శ్రీనివాస్ గౌడ్, శంకర్ నాయక్, లోక్య నాయక్ ఉన్నారు.

