తుర్కపల్లి, నవంబర్ 5 : కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి ఆ పార్టీకి ఓటేస్తే కరెంటు కష్టాలు తప్పవని ప్రభుత్వ విప్, ఆలేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వాసాలమర్రి, రాంశెట్టిపల్లి, కొండాపురం, శ్రీనివాసపురం, గోపాలపురం, నాగాయపల్లితండా, నాగాయపల్లి, చిన్నలక్ష్మాపురం, కేవులాతండా, పొట్టిమర్రితండా, మాదాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఆమెకు మహిళలు బతుకమ్మలతో ఘనస్వాగతం పలికారు. మహిళలతో కలిసి ప్రభుత్వ విప్ బతుకమ్మ ఆడారు. బీఆర్ఎస్వీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేస్తే తెలంగాణ చీకటి రాజ్యం అవుతుందని పేర్కొన్నారు.
గత పాలకుల పాలనలో ఏడారిగా ఉన్న ఈ ప్రాంతాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి కాల్వల ద్వారా కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి చెరువులు, కుంటలు నింపినట్లు తెలిపారు. వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలని, రైతులు రైతుబంధు తీసుకునే బిచ్చగాళ్లు అని రేవంత్రెడ్డి అహంకారపూరిత మాటలు మాట్లాడుతున్నాడని, అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి ఎత్తివేస్తామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారని, ఇలాంటివారు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ప్రజలంతా తనను మరోసారి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్సీ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ధనావత్ బీకూనాయక్, ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ తేజస్వీనిఖిల్, అధికార ప్రతినిధి శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు పోగుల ఆంజనేయులు, నామసాని సత్యనారాయణ, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పలుగుల నవీన్కుమార్, ఎంపీటీసీ గిద్దె కరుణాకర్, బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు ర్యాకల రమేశ్యాదవ్ పాల్గొన్నారు.
మోటకొండూర్ : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే బీఆర్ఎస్ను గెలిపిస్తాయని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు చామల ఉదయ్చందర్రెడ్డి, అక్షయ్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కాటేపల్లిలో సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు మంత్రి రాజుతో కలిసి ఇంటింటికీ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలేరును అభివృద్ధి పథంలో నడిపిస్తున్న గొంగిడి సునీతామహేందర్రెడ్డి వైపే ప్రజలంతా ఉన్నట్లు తెలిపారు. మరింత అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్న సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కానుగంటి కొమురయ్య, నాయకులు సోములు, సాయి, శ్రీకాంత్, శ్రీనివాస్, మల్లేశ్, ఉమారెడ్డి పాల్గొన్నారు.
మోటకొండూర్ : ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి గెలుపు కోసం మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం జోరుగా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఎగ్గిడి కృష్ణ, మండల కో ఆప్షన్ సభ్యుడు బురాన్, మాజీ సెక్రటరీ జనరల్ సిరబోయిన నర్సింహులుయాదవ్, మాజీ ఉప సర్పంచ్ బొట్ల నర్సింహ, నాయకులు వెంకటేష్, ఎలేందర్, జహంగీర్, పాండు, మధు, మహేశ్, ప్రశాంత్, విజయ్చందర్, లక్ష్మీనారాయణ, యాదయ్య, గంగాధర్, బాలకృష్ణ, నర్సింహ పాల్గొన్నారు.
ఆలేరు రూరల్ : మండల వ్యాప్తంగా ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి గెలుపు కోరుతూ.. బీఆర్ఎస్ నాయకులు ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
గుండాల : మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో తుర్కలశాపురం సర్పంచ్ భిక్షమయ్య, ఉప సర్పంచులు గణేశ్, యాదయ్య, మల్లేశ్, నాయకులు ఓడపల్లి వెంకన్న, మజ్జిగ సాయి, మాధవరెడ్డి, మాటూరి కాశయ్య, స్వామి పాల్గొన్నారు.