బీబీనగర్: అర్హులైన ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని యాదాద్రి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాల యంలో 35 మందికి కల్యాణలక్ష్మి, 6గురికి షాదీముభారక్ చెక్కులతో పాటు లాంఛనంగా పట్టుచీరలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందిస్తూ సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని అన్నారు.
బీబీనగర్ మండలంలో స్థానికంగా ఉన్న ప్రభుత్వ దవాఖానలోని ఆంబులెన్స్ మెయింటనెన్స్కు అయ్యే ఖర్చు రూ.3 లక్షల చెక్కును ఎంపీడీవోకు అందజేశారు. అనంతరం మండలంలోని రామునిగుండ్ల తండా సర్పంచ్ భానోతు శాంతి ఉమ్లానాయక్ కుమారుడు అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీబీనగర్ పట్టణంలోని స్టేషన్ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాన్ని పరిశీలించారు.
కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్థాయి సంఘం చైర్మన్ జడ్పీటీసీ గోలి ప్రణితా పింగళ్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్రెడ్డి, భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆల్వ మోహన్రెడ్డి, వైస్ ఎంపీపీ వాకిటి గణేశ్రెడ్డి, ఎంపీటీసీ గోరుకంటి బాలచందర్, సర్పంచ్ మంచాల రవికుమార్, సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి శ్రీనివాస్, ఎంపీ డీవో శ్రీవాణి, తహసీల్దార్ వెంకట్రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.