కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి పెద్దఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. ఆదివారం భువనగిరి
34వ వార్డు కౌన్సిలర్తోపాటు డీసీసీ సెక్రటరీ, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు, మాజీ సర్పంచులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. అలాగే వలిగొండ మండలం వర్కట్పల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, భూదాన్పోచంపల్లిలో పలు యూనియన్ సంఘాల నాయకులు, యువకులు బీఆర్ఎస్లో చేరారు.
భువనగిరి అర్బన్, నవంబర్ 5: భువనగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి కండ్ల ముందే కనబడుతుందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణ పరిధిలోని ఓ పంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యాక్రమంలో కాంగ్రెస్కు చెందిన 34వ వార్డు కౌన్సిలర్ కోళ్ల దుర్గాభవానీగంగాధర్, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు బింగి నరేశ్, చందుపట్ల మాజీ సర్పంచ్ చిన్న శ్రీనివాస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతం మరింత అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్తో సాధ్యపడుతుందన్నారు. బస్వాపూర్ రిజర్వాయర్తో ఇంటింటికి తాగునీరు, రైతులకు సాగు నీరు అందజేస్తున్నట్లు తెలిపారు. భువనగిరి నియోజకవర్గం 10 సంవత్సరాల క్రితం ఎలాగుందో, ఇప్పుడెలాగుందో ఈ ప్రాంత ప్రజలకు తెలుసునన్నారు. గతంలో పట్టణంలో ఒక వాహనం వస్తే మరో వాహనం వెళ్లేది కాదని, ట్రాఫిక్ జామ్తో ప్రమాదాలు జరిగేవన్నారు.
మంత్రి కేటీఆర్ చొరవతో ప్రధాన రహదారి వెడల్పు, భువనగిరి పెద్ద చెరువు మినీ ట్యాంక్బండ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఓపెన్ స్టేడియం, అధునాతన రైతుబజార్, గ్రంథాలయ భవనం, నిరాశ్రయుల భవనం నిర్మించినట్లు తెలిపారు. ప్రజలు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. తనను మరోసారి ఆశీర్వదిస్తే ఈ ప్రాంతం అద్భుతంగా మారుతుందన్నారు. అదేవిధంగా పట్టణంలోని సింగన్నగూడెంకాలనీలో ఎమ్మెల్యే సతీమణి పైళ్ల వనితా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, జడ్పీటీసీ బీరు మల్లయ్య, బీఆర్ఎస్ పట్టణ, మండలాధ్యక్షులు ఏవీ కిరణ్కుమార్, జనగాం పాండు, మాజీ పట్టణాధ్యక్షుడు గోమారి సుధాకర్రెడ్డి, పట్టణ, మండల ప్రధాన కార్యదర్శులు రచ్చ శ్రీనివాస్రెడ్డి, నీల ఓంప్రకాశ్గౌడ్, నాయకులు ఎడ్ల వెంకట్రెడ్డి, రాజేశ్, సమ్మీ పాల్గొన్నారు.