నల్లగొండ, జూన్ 15 :కాంగ్రెస్ పాలనలో ఎన్నో అవినీతి, అక్రమాలు, స్కామ్లు జరిగాయి, అలాంటి తప్పుడు పనులకు కేరాఫ్ అయిన కాం గ్రెస్ పార్టీలో సీనియర్ అయిన నువ్వు వెన్నెనుక తప్పులు దాచుకోని నీతులు మాట్లాడితే సరికాదని, హుందాగా మాట్లాడితే గౌరవంగా ఉంటుందని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను అన్నారు. కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క నల్లగొండలో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిపై చేసిన విమర్శలపై జిల్లా కేంద్రంలోని డీసీసీబీ కార్యాలయం లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి మంత్రి జగదీశ్రెడ్డి ఈ తొమ్మిండ్ల కాలంలో సీఎం కేసీఆర్ ను ఒప్పించి వేల కోట్ల నిధులు తెచ్చి ఉమ్మడి నల్లగొండ జిల్లాను ఎంత అభివృద్ధి చేసిండో చూస్తూనే కండ్లున్న కబోదిలా మాట్లాడుతావేంది అని భట్టిని ప్రశ్నించారు. మీ ఏలుబడిలో నల్లగొండలో నలుగురు మంత్రి గిరి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు ఉమ్మడి జిల్లాలో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండగా… నేడు 30 లక్షల టన్నుల ధాన్యం పండుతున్నా విషయం మీ నేతలు చెప్పడం లేదా రాష్ట్రంలో నల్లగొండే నంబర్ వన్ స్థానం అని నీకు తెలియదా అని ప్రశ్నించారు.
నీవు చేసే పాద యాత్రలో జిల్లాకు వచ్చే సాగు నీరు, ప్రజలు తాగే తాగు నీరు, 24 గంటలు అందించే విద్యుత్, జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులు, ప్లోరోసిస్ నుంచి బయట పడ్డ మునుగోడు ప్రజల సంతోషం, కాళేశ్వరం జలాలు, బస్వాపురం, యాదాద్రి టెంపుల్, పవర్ ప్లాంటు నిర్మాణాలు వినడం లేదా జనం చెప్పడం లేదా అని ప్రశ్నించారు. రూ.1200 కోట్లతో నల్లగొండ నియోజక వర్గం సుందరంగా తీర్చిదిద్దుతుంటే మీ పార్టీలో ఉండి మంత్రిగిరి చేసిన వారు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు నల్లగొండ డీసీసీబీలో రూ.30 కోట్ల అవినీతి జరిగితే అప్పటి పాలక వర్గంపై చర్యలు తీసుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ పాత కమిటీని రద్దు చేసి అవినీతి సొ మ్మును రికవరీ చేస్తున్నామన్నారు. నాడు ఏడు గంటల అరకొర విద్యుత్ సరఫరాతో రైతులు బావుల వద్దే ఉండే వారని నేడు 24 గంటల కరంట్ నాణ్యంగా వస్తుండడంతో రైతులకు ఆ బాధలు తప్పిన విషయం చూస్తలేవా అని బట్టి విక్రమార్కను ప్రశ్నించారు. మీ హయాంలో జిల్లా కాంగ్రెస్ నేత గృహ నిర్మాణం మంత్రిగా చేసినప్పు డు ఎంత అవినీతి జరిగిందో తెలియదా అన్నారు. మీరు మీ పాలనలో అభివృద్ధ్ది చేశామని మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంటాయని అన్న ఆయన మొదట మీ పార్టీలో ఉన్న నేతలంతా కొట్లాడడం మానేసి కలిసి ఉండటం నేర్చుకోండి అన్నారు. ఇకపై బీఆర్ఎస్పై లేదంటే మం త్రి , మండలి చైర్మన్పైనా విమర్శలు చేస్తే ప్రజ లు పాదయాత్ర కూడ చేయనివ్వరు అని హెచ్చరించారు.