దేవరకొండ: కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రవేటీకరణ చేసేందుకు కుట్రపన్నుతుందని బ్యాంక్ ఎంప్లాయిస్ కో-ఆర్డినేషన్ కమిటి సభ్యులు ఎన్వీటీ అన్నారు. గురువారం దేవరకొండ ఎస్బిఐ బ్యాంకు ముందు 9 ట్రేడ్ యూనియన్ బ్యాంక్ సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్విటి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రవేటికరణ చేస్తే బ్యాంకుల గారేంటిని అయన ప్రశ్నించారు.
చిన్న, సన్నకారు రైతులకు చాలా నష్టం వాటిల్లుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను కాపాడుకోవాలని,కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రవేటికరణ చేసే ఆలోచన మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమ్మెకు శ్రీధర్, రామ్మోన్, సుమన్, నరసింహ, ప్రవీణ్, జీవన్, విద్యార్ధి సంఘాల నాయకులు, పలువురు మద్దతు తెలిపారు.