బొడ్రాయిబజార్, మే 27 : సీఎం కేసీఆర్ అన్ని రంగాలతోపాటు క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసి క్రీడాకారుల్లో చైతన్యం తెచ్చేందుకే వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి అండర్-16 బాల బాలికల బాస్కెట్బాల్ పోటీల ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. క్రీడాకారులు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తమలోని ప్రతిభను మెరుగుపర్చుకొని రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించాలన్నారు. గతంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీలు నిర్వహించడంతోపాటు ప్రస్తుతం బాస్కెట్బాల్ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించిన ఘనత మంత్రి జగదీశ్రెడ్డికే దక్కిందన్నారు.
సూర్యాపేటను 4 వేల కోట్లతో అభివృద్ధి చేసి రాష్ర్టానికే రోల్ మోడల్గా తీర్చిదిద్దారన్నారు. క్రీడలతో పట్టుదల, గౌరవం, గుర్తింపు వస్తుందని, క్రీడాకారులు ఉత్సాహంగా ఆటల్లో ముందుకు సాగాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ నైపుణ్యం పెంచుకొని తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలన్నారు. అనంతరం బాలికల విభాగంలో మొదటి బహుమతి సాధించిన మేడ్చల్ మల్కాజ్గిరి, ద్వితీయ బహుమతి పొందిన ములుగు, బాలుర విభాగంలో మొదటి బహుమతి సాధించిన మేడ్చల్ మల్కాజ్గిరి, ద్వితీయ బహుమతి సాధించిన వికారాబాద్ జట్లకు షీల్డులు, మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. అలాగే పోటీలను విజయవంతంగా పూర్తిచేసిన రిటైర్డ్ పీఈటీలు, పీడీలను సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ సురేశ్, జిల్లా క్రీడల అధికారి వెంకట్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ నార్మల్ ఐజాక్, జిల్లా ఉపాధ్యక్షుడు పుట్ట కిశోర్, కార్యదర్శి ఫారూక్, రిటైర్డ్ పీఈటీలు, పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
రెండు విభాగాల్లోనూ మేడ్చల్ మల్కాజ్గిరికే ప్రథమ స్థానం
రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీలు శనివారం ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 31జిల్లాల బాలబాలికల జట్లు పోటీల్లో తలపడగా బాలబాలికల విభాగాల్లోనూ మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా జట్లు ప్రథమ బహుమతి పొందాయి. బాలికల క్వార్టర్ పైనల్స్లో మహబూబ్నగర్పై ఖమ్మం, సెమీ ఫైనల్స్లో ఖమ్మంపై ములుగు, వికారాబాద్పై మేడ్చల్ మల్కాజ్గిరి జట్లు గెలుపొందగా, ఫైనల్స్లో ములుగుపై మేడ్చల్ మల్కాజ్గిరి జట్టు గెలుపొందింది. బాలుర విభాగంలో క్వార్టర్ ఫైనల్స్లో నిర్మల్పై హైదరాబాద్, ములుగుపై వికారాబాద్, జగిత్యాలపై మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డిపై కామారెడ్డి జట్లు గెలుపొందాయి. బాలుర సెమీ ఫైనల్స్లో కామారెడ్డిపై మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్పై వికారాబాద్ జట్లు గెలుపొందాయి. ఫైనల్స్లో వికారాబాద్పై మేడ్చల్ మల్కాజ్గిరి జట్టు విజయం సాధించింది. మొత్తంగా బాలుర విభాగంలో ప్రథమ స్థానం మేడ్చల్ మల్కాజ్గిరి, ద్వితీయ వికారాబాద్, తృతీయ కామారెడ్డి, బాలికల విభాగంలో ప్రథమ మేడ్చల్ మల్కాజ్గిరి, ద్వితీయ ములుగు, తృతీయ వికారాబాద్ గెలుపొందాయి.