ముదిగొండ, ఆగస్టు 6 : కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని తీవ్ర మ నస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన గడ్డం వేణుకుమార్కు బీ ఆర్ఎస్ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర లక్ష ఆర్థిక సాయం అందజేశారు. ఆయన పంపిన నగదును ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు, బీఆర్ఎస్ నాయకులు గురువా రం వేణును పరామర్శించి అందజేశారు.
ఆత్మహత్యకు యత్నించిన తాను అసలు బతుకుతానని అనుకోలేదని వేణుకుమార్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని పదే పదే చెబితే ‘నాకు ఏదో ఒక ఉద్యోగం రాకపోతుందా?’ అని భావించినట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, జ్యాబ్ క్యాలెండర్ ఊసే లేదని విమర్శించారు.
ప్రభుత్వ వైఫల్యాలపై ఏదైనా మాట్లాడితే బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ‘నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని అడిగితే.. మా గ్రామంలోని ఓ నాయకుడు నీకు ఇల్లు రాదు.. రానివ్వను’ అని అన్నాడని, ఇంతకంటే అన్యాయం ఉంటుందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ తనకు ఎంతో అండగా నిలిచిందని, కేటీఆర్ సార్ కూడా తనతో మాట్లాడి ధైర్యం చెప్పారంటూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.