సంస్థాన్ నారాయణపురం, డిసెంబర్ 11 : మండలంలోని చిమిర్యాల గ్రామానికి చెందిన బీజేపీ మాజీ సర్పంచ్ గడ్డం స్వామి, శివశంకర్ గౌడ్, మర్రి కృష్ణ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో హైదరాబాద్లోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మొగుదాల నరేశ్, గడ్డం లింగయ్య పాల్గొన్నారు.
నేడు మునుగోడులో పర్యటన
మునుగోడు : ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సోమవారం మండలంలో పర్యటించనున్నట్ల బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంలోని పలు వార్డుల్లో పర్యటించి సమస్యలను తెలుసుకొనున్నారు. అనంతరం రైతు వేదికలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. పార్టీ శ్రేణులు,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.