మహబూబ్ నగర్ : కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narendhar reddy) మాతృమూర్తి రుక్కమ్మ ( Mother Rukkamma) మృతి చెందారు . కొద్దిరోజులుగా అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణం విడిచారు.
శనివారం షా బాద్ మండలం గొల్లురుగుడాలో ఆమె పార్థివ దేహానికి మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ ,లక్ష్మారెడ్డి , దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి , ఎమ్మెల్సీ నవీన్ , తదితరులు సందర్శించి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డిని పరామర్శించి ,ఓదార్చి, ధైర్యం చెప్పారు.