పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఏ ఒక్కరికీ ఆపద రాకుండా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మాతాశిశు సంరక్షణకు పెద్దపీట వేశారు. స్వరాష్ట్రంలో అంగన్ వాడీలను గతంలో ఎన్నడూ లేనంతగా బలోపేతం చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా శిశువులు, గర్భిణులు, ఆడబిడ్డలకు పోషకాహారాన్ని అందిస్తున్నారు. టీచర్లు, ఆయాలకు మూడు సార్లు గౌరవ వేతనాలు పెంచి తలెత్తుకొని జీవించేలా చేశారు. మహిళలు, చిన్నారుల్లో పోషకాహారం కోసం ఆరోగ్యలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చారు. ఈ తరహా పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడంలేదు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని అంగన్వాడీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కార్యసాధకుడైన కేసీఆర్కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ముక్తకంఠంతో చెబుతున్నారు.
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన అనేక పథకాల్లో ఆరోగ్యలక్ష్మి ఒకటి. ఈ పథకం ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నారు. మధ్యాహ్నం పూట భోజనం పెడుతున్నారు. తీవ్ర పోషకాహారం లోపం, అతి తీవ్ర పోషకాహార లోపం ఉన్న వారిని గుర్తించి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. కౌమార బాలికలకు న్యూట్రిషన్ కిట్ ఇస్తున్నారు. ఇందులో 10కిలోల గోధుమలు, 500 గ్రాముల నెయ్యి, కిలో ఖర్జూర, 750గ్రాముల ప్రొటీన్ బిస్కెట్లు, 800 ఎం.ఎల్. ఐరన్ జింక్ సిరప్తోపాటు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు అందిస్తున్నారు. తల్లులు, పిల్లలకు నెలనెలా గుడ్లు ఇస్తున్నారు. ఏడు నెలల నుంచి మూడేండ్ల వరకు పిల్లలకు బాలామృతం అందజేస్తున్నారు. పిల్లలకు స్నాక్స్ పెడుతున్నారు. శనివారం, గురువారం ప్రత్యేకంగా పెరుగు, పాలు అందిస్తున్నారు. చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తున్నారు.
స్వరాష్ట్రంలో అంగన్వాడీలు బలోపేతం..
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో అంగన్వాడీలను బలోపేతం చేశారు. కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించి గతానికి భిన్నంగా సేవలు అందిస్తున్నారు. చిన్నారులకు బాల్య విద్యను అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,203మంది అంగన్వాడీ టీచర్లు పనిచేస్తున్నారు. ఇందులో యాదాద్రి భువనగిరిలో 901, నల్లగొండలో 2,093, సూర్యాపేట జిల్లాలో 1,209మంది ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న ఒక్కో టీచర్కు సర్కారు ట్యాబ్ ఇచ్చింది. ఇందులోనే పిల్లల హాజరు శాతం, పథకాల అమలు తీరును అప్డేట్ చేస్తున్నారు. రాష్ట్రం వచ్చేనాటికి అంగన్వాడీ టీచర్ల గౌరవ వేతనం 4400 రూపాయలు ఉండగా.. ఇప్పుడు రూ.13,650కి పెంచి సముచిత గౌరవం కల్పించారు. ఆయాలకు నెలకు 6,500 గౌరవ వేతనం ఇస్తున్నారు. అంగన్వాడీల బలోపేతానికి, మాతాశిశు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని అంగన్వాడీలు కోరుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో సమస్యలు తెలిసిన ఉద్యమ నేత సేవలు దేశానికి చాలా అవసరమని పేర్కొంటున్నారు. ఆయన దేశ రాజకీయాల్లోకి వస్తే అండగా ఉంటామని చెప్తున్నారు.
సమర్థుడైన సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం
ఇంట గెలిచినోడు రచ్చ గెలుస్తాడని పెద్దలు చెప్తుంటారు. అది అక్షరాల మన ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేస్తారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ తన మార్క్ చూపిస్తారనే నమ్మకం ఉంది. 14 ఏండ్లపాటు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. స్వరాష్ట్రం
వచ్చాక అన్ని రంగాలను అభివృద్ధి చేసి చూపించారు. ప్రజలకు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ పల్లెలు, పట్టణాలను తీర్చిదిద్దారు. చరిత్రలో ఏ ప్రభుత్వంలోనూ లేని విధంగా అంగన్వాడీ టీచర్లను అక్కున చేర్చుకొని వేతనాలు
పెంచారు. పనికి దగ్గ ప్రతిఫలం అందజేస్తున్న మహానుభావుడు కేసీఆర్. ప్రస్తుత పరిస్థితుల్లో సమర్థుడైన సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరం.
–పెండెం లక్ష్మీకళ, అంగన్వాడీ టీచర్, కొరటికల్, ఆత్మకూరు(ఎం)
దేశానికి కేసీఆర్ వంటి రాజనీతజ్ఞుడు అవసరం
ప్రస్తుతం భారతదేశం అభివృద్ధిలో చాలా వెనుకబడి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతున్నది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను విస్మరించి హక్కులను కాలరాస్తున్నది. మోదీ ఎన్నికల సమయంలో పాకిస్తాన్, చైనా యుద్ధాలంటూ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల దేశాభివృద్ధి వెనుకబడి పోతున్నది. వ్యవసాయం, ఉపాధి రంగాలకు ప్రోత్సాహకం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో దేశానికి సీఎం కేసీఆర్ వంటి గొప్ప రాజనీతజ్ఞుడు అవసరం. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశాభివృద్ధి సాధించడంతోపాటు దేశ ప్రజలంతా బాగుపడుతారు. సీఎం కేసీఆర్ అపర చాణిక్యుడు. రాజకీయాల్లో మూడున్నర దశాబ్దాలుగా ఎన్నో విజయాలను సాధించారు. ఆరున్నర దశాబ్దాల తెలంగాణ ఉద్యమ పోరుకు తన నాయకత్వంలో ఒక రూపు తీసుకొచ్చారు. ఆయనకు జాతీయ, అంతర్జాతీయ, సమకాలీన అంశాలతోపాటు చరిత్రపై మంచి అవగాహన ఉంది. ముఖ్యంగా దక్షిణాది నాయకుల్లో కేసీఆర్కు మాత్రమే హిందీ భాషపై మంచి పట్టు ఉంది. అన్ని అర్హతలున్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణిస్తారు. నాటి మన ప్రధాని పీవీ నర్సింహారావు తర్వాత పరిపాలన అనుభవం కలిగిన సమర్థవంతమైన నాయకుడు కేసీఆర్.
– ఎ.మంగమ్మ, అంగన్వాడీ ఆయా, రామకృష్ణనగర్, నల్లగొండ (నీలగిరి)
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లడం అవసరం
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకోవడం సరైనదే. దేశంలో విద్యా రంగంలో భారీ మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీ టీచర్ల జీతాలు పెరుగడం, స్కూళ్లలో వసతులు మెరుగుపడడం, సన్న బియ్యంతో భోజనం, పోషణ్ అభియాన్ వంటి పండుగలు చేయడం చాలా బాగున్నాయి. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. పేదలకు పింఛన్లు అందిస్తున్నారు. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలన తెచ్చారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి అమలు చేశారు. వాటిని ఆదర్శంగా తీసుకుని మన ముఖ్యమంత్రి దేశ రాజకీయాల్లోకి వెళ్లడం ఎంతో శ్రేయస్కరం.
– రాములమ్మ, అంగన్వాడీ టీచర్, మఠంపల్లి
దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం కావాలి
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయి. అడిగితే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయంటున్నారు. ధరలు ఇలా పెరుగుతుంటే.. పేదలు ఎలా బతుకుతరు. పెరిగిన ధరలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ మాకు మూడు సార్లు జీతం పెంచారు. ఆయన వంటి నాయకుడు అన్ని రాష్ర్టాలకు ఉంటే అందరూ బాగుపడుతారు. ప్రజల మంచి కోరుకునేవాళ్లు, మంచి చేసేవాళ్లు ఉండాలని కోరుకుంటున్నాం. సీమాంధ్ర పాలనలో కరెంటు ఎప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో అర్థమయ్యేది కాదు. స్వరాష్ట్రంలో 24 గంటలు కరెంటు వస్తుంది. ఇది కేసీఆర్ సాధించిన విజయమే కదా. ఇటువంటి నాయకుడిని ఎవరొద్దంటరు. సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలన అద్దం లెక్క కనిపిస్తున్నది. వ్యవసాయంతోపాటు విద్య, వైద్య రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తూ ఆర్థిక వ్యవస్థను ఆగం చేశారు. వ్యవసాయం, ఉపాధి రంగాలకు ప్రోత్సాహమే లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో దేశాన్ని కాపాడేందుకు కేసీఅర్ వంటి నాయకుడు కావాలి.
– బత్తుల మల్లికాంబ, అంగన్వాడీ టీచర్, శ్రీనగర్ కాలనీ, నల్లగొండ (నీలగిరి)
సీఎం కేసీఆర్తో బంగారు దేశంగా మార్పు..
తరతరాలుగా దోపిడీకి గురవుతున్న తెలంగాణ విముక్తికి 13 ఏండ్లపాటు అవిశ్రాంతంగా పోరాడి రాష్ట్రాన్ని సాధించిన యోధుడు సీఎం కేసీఆర్. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలిపిన అపర చాణిక్యుడు. తెలంగాణ దరిద్రం పోగొట్టి అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కేలా చేసి, దేశంలోని రాష్ర్టాలన్నీ తెలంగాణ వైపు చూసేలా చేసిన రాజనీతజ్ఞుడు. పేదరికం రూపుమాపాలంటే విద్యతోనే సాధ్యమని భావించిన సీఎం కేసీఆర్.. పేదలకు కార్పొరేట్ స్థాయిలో విద్యనందించేందుకు గురుకులాలను తీసుకొచ్చారు. ప్రధాని మోదీ పాలనలో దేశంలోని వ్యవసాయంతోపాటు అనేక రంగాలు క్లిష్ట పరిస్థితిలోకి వెళ్లాయి. వాటిని కాపాడేందుకు దేశానికి సీఎం కేసీఅర్ విజన్ చాలా అవసరం. ఆయన అలోచనలు, పరిపాలన దక్షతతో భారతదేశం బంగారు దేశంగా మార్పు చెందుతుంది.
– ఖుర్షిదాబేగం, ఆర్జాలబావి అంగన్వాడీ టీచర్ (నీలగిరి)
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలి
తెలంగాణను సాధించిన అనతి కాలంలోనే అభివృద్ధిలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్.. అన్ని వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేశారు. అంగన్వాడీ, మినీ అంగన్వాడీల టీచర్లు, ఆయాల వేతనాలు పెంచి ఆదుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు ముందుండాలి. ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ కేంద్రంలో కీలకంగా మారితే తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలవుతాయి.
– నందిపాటి ఎలిజబెత్, దిర్శించర్ల అంగన్వాడీ టీచర్ (నేరేడుచర్ల)
తెలంగాణ మాదిరిగా దేశ అభివృద్ధి..
ఉద్యమ నేత, మంచి పాలనాదక్షత కలిగిన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశ భవిష్యత్ బంగారుమయం అవుతుంది. తెలంగాణ మాదిరిగా దేశాన్ని కూడా అభివృద్ధి చేస్తారు. దేశంలోని బడుగు, బలహీన వర్గాల జీవితాలు మారుతాయి. తెలంగాణను సాధించిన అనతికాలంలోనే అభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలిచింది. అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకునే పిల్లలతోపాటు గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత నూతన అంగన్వాడీ భవనాలను నిర్మించారు. కేంద్రాలకు సరుకులు సరైన సమయంలో వస్తున్నాయి. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు మూడు సార్లు వేతనాలు పెంచి ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్దే. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలవుతాయి. మిగతా రాష్ట్రాల్లోని అంగన్వాడీ కేంద్రాలు బాగుపడుతాయి.
– గంటెకంపు రామలింగమ్మ, మునుకుంట్ల అంగన్వాడీ టీచర్ (కట్టంగూర్)
ప్రత్యేక విజన్తో ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్..
ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు. తెలంగాణ సాధించిన అనతి కాలంలోనే రాష్ర్టాన్ని దేశంలో నంబర్ వన్గా తీర్చిదిద్దారు. అన్ని వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు గౌరవ వేతనం పెంచి ఆర్థిక భరోసా కల్పించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశమంతా అమలు చేసే అవకాశం ఉంటుంది. విద్యా వ్యవస్థ బాగు పడుతుంది. ప్రత్యేక విజన్తో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజలంతా అండగా నిలుస్తారు.
– ఇంజమూరి జంగమ్మ, అంగన్వాడీ టీచర్, భూదాన్ పోచంపల్లి
స్వరాష్ట్రంలో అంగన్వాడీలు బలోపేతం..
గత ముఖ్యమంత్రులతో పోలిస్తే సీఎం కేసీఆర్ ఎంతో భిన్నం. స్వరాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేశారు. గతంలో చాలీచాలని వేతనాలతో అంగన్వాడీ టీచర్లు, ఆయాల పరిస్థితి దయనీయంగా ఉండేది. ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు సార్లు వేతనాలు పెంచి అంగన్వాడీల కుటుంబాల్లో వెలుగులు నింపారు. గతంలో రూ.4,200 జీతం ఉండగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.13,650కు పెంచారు. అంగన్వాడీ కేంద్రాల్లో రక్తహీనత, పోషకాహార లోపాలను అధిగమించేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశంలోని వివిధ రాష్ర్టాల్లోనూ అమలు చేస్తున్న పరిస్థితి. సంక్షేమ ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే మరిన్ని విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయి.
– దంతూరి భాగ్యమ్మ, చందుపట్ల అంగన్వాడీ-1 టీచర్ (భువనగిరి కలెక్టరేట్)