అనాజిపురం ఎంపీటీసీ గద్దల నాగరాజుతోపాటు పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. నాగారం మండలం ఈటూరు గ్రామానికి చెందిన 20 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సమక్షంలో.. తిప్పర్తి మండలం తానేదార్పల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ కొండ్ర జానయ్యతోపాటు పలువురు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. సంస్థాన్ నారాయణపురంలో బీజేపీకి చెందిన 10 మంది ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
– పెన్పహాడ్/నాగారం/తిప్పర్తి, ఆగస్టు 14
నాగారం, ఆగస్టు 14 : రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, దేశ్ కీ నేత కల్వకుంట్ల చంద్రశేకర్రావు రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు మద్దతుగానే బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నట్లు తుంగుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తెలిపారు. సోమవారం మండలంలోని ఈటూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు పేరాల ఉపేందర్తోపాటు 20 మంది హైదరాబాద్లో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్న మహనీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య, బీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్బాబు, జిల్లా నాయకుడు ఉఎర్ర యాదగిరి, మండల అధికార ప్రతినిది చిల్లర చంద్రమౌళి, వర్ధమానుకోట ఎంపీటీసీ-2 వడ్డె పరశురాములు, గంట నరసింహారెడ్డి, పేరాల యాదగిరి, యాల వెంకన్న పాల్గొన్నారు.