స్వరాష్ట్రంలో అన్ని రంగాలకు ప్రాధాన్యం లభిస్తున్నది. కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది. వృత్తిదారుల నుంచి వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారికి తోడ్పాటు అందిస్తున్నది. సబ్సిడీలు, జీతాల పెంపు, బీమా, పన్ను రద్దు, బకాయిలు మాఫీ వంటివి చేపట్టి భరోసాగా నిలుస్తున్నది. అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత పథకం అమలు చేస్తున్నది. చేనేత కార్మికులకు బీమా, సబ్సిడీలు, పొదుపు పథకం అమలు చేస్తున్నది. మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీతోపాటు సబ్సిడీపై వాహనాలు అందజేస్తున్నది. గీత కార్మికులకు చెట్ల పన్ను రద్దు చేసి బీమా కల్పించింది. ఆటో డ్రైవర్లు, జర్నలిస్టులు, హోంగార్డులకు అండగా అనేక పథకాలు అమలు చేస్తున్నది. సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేడేను ఘనంగా నిర్వహించేందుకు కార్మిక సంఘాలు ఏర్పాట్లు చేశాయి.
– యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ)
స్వరాష్ట్రంలో బాగుపడిన కార్మికులు
రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నది. దేశంలో ఎకడా లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల కష్టాలను తీరుస్తున్నది. ప్రమాద, ఆరోగ్య బీమా అందిస్తూ ఆపతాలంలో తోడుంటున్నది. అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత పథకం అమలు చేస్తున్నది. అర్హులైన కార్మికులకు పింఛన్లు అందిస్తూ ఆసరా అవుతున్నది. కార్మికులకు బోనస్, జీతాలు పెంచుతూ అండగా ఉంటున్నది. చేనేత కార్మికులకు బీమా పథకం, సబ్సిడీలు, పొదుపు పథకం అమలు చేస్తున్నది. మత్స్యకారులకు ఉచితంగా చేపల పంపిణీతోపాటు సబ్సిడీపై వాహనాలు అందజేస్తున్నది.
– యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ)
ఆర్టిజన్ల రెగ్యులరైజేషన్..
ఎన్నో ఏండ్లుగా పెండింగులో ఉన్న విద్యుత్ ఆర్టిజన్ల సమస్య తొలగిపోయింది. సంవత్సరాలుగా రెగ్యులరైజ్ చేయాలని కార్మికులు అనేక ఉద్యమాలు, పోరాటాలు చేశారు. కేసీఆర్ ఒక కలంపోటుతో 25 వేల విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేశారు. దీంతో వారికి అన్ని రకాల సదుపాయాలు దక్కుతున్నాయి. ఇతర ఉద్యోగుల్లాగే ఇంక్రిమెంట్లు, పీఆర్సీ, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు.
మారిన నేత కార్మికుల బతుకులు
ఉమ్మడి రాష్ట్రంలో చేనేత రంగాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. నేతన్నల ఆకలి చావులు, ఆత్మహత్యలు చేసుకున్నా చలించలేదు. ఉన్న ఒకటి, రెండు పథకాలను నీరుగార్చారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఆసరా కావడంతో నేతన్నల బతుకులు మారాయి. 11,218 మంది నేత కార్మికులు పొదుపు పథకంలో లబ్ధి పొందారు. నూలు, రసాయనాలపై సబ్సిడీ అందిస్తున్నది. నేత కార్మికులకు పింఛన్లు ఇస్తున్నది. పవర్ లూమ్స్కు సంబంధించి 50 శాతం విద్యుత్ రాయితీ అందజేస్తున్నది. దేశంలో ఎకడా లేని విధంగా నేతన్నలకు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏ కారణాలతో చనిపోయినా కుటుంబ సభ్యులకు 5 లక్షలు అందించి ఆదుకుంటున్నది.
కార్మికులకు మరెన్నో కార్యక్రమాలు..
గీత కార్మికులకు..
గౌడన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. చెట్లకు ప న్ను వసూలు చేసే విధానానికి స్వస్తి చెప్పింది. అంతేకాకుండా రూ.7.98 కోట్ల బ కాయిలను రద్దు చేసింది. గీత కార్మికులకు సైతం ఆసరా పెన్షన్లు అందిస్తున్నది. గీత కార్మికులు మరణిస్తే పరిహారం కింద రూ.5 లక్షలు ఇస్తున్నది. గతంలో శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ.50 వేలు మాత్రమే పరిహారం లభించేది. తెలంగాణ ప్రభుత్వం ఆ పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచింది. రాష్ట్రంలోని గీత కార్మికుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోతున్నదని ఆర్థిక మంత్రి హరీశ్రావు ఇటీవల బ డ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు.
మత్స్య కార్మికుల జీవితాల్లో వెలుగులు
స్వరాష్ట్రంలో కులవృత్తులకు పూర్వ వైభవం వచ్చింది. ముదిరాజ్ల అభ్యున్నతికి ఏటా చేపలను ఉచితంగా పంపిణీ చేస్తున్నది. జిల్లాలో సుమారుగా ఏటా రూ. 3 కోట్లతో 3.5 చేప పిల్లలను 900 చెరువుల్లో వదులుతున్నది. అంతేకాకుండా75 శాతం సబ్సిడీపై వాహనాలను అందిస్తున్నది. ద్విచక్ర వాహనాలు, లగేజీ ఆటోలను పంపిణీ చేసింది. అదేవిధంగా ఫిష్ ఔట్లెట్లు ఇచ్చింది.
కార్మికుల హక్కులను కాలరాస్తున్న బీజేపీ
కార్మికుల సంక్షేమ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. ఆటో, ట్రాక్టర్ కార్మికులకు ట్యాక్స్లు రద్దు చేసింది. ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడికి రూ.5 లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పించింది. నాయీబ్రాహ్మణులు, రజకులకు వృత్తిపరంగా వెసులుబాటు కల్పించింది. ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్లకు వేతనాలు పెంచింది. అదే కేంద్ర ప్రభుత్వం 43 చట్టాలను 4 చట్టాలకు కుదించింది. పనికి తగ్గ వేతనం లేదు. 8 గంటల పని విధానాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తుంది. పీఎఫ్పై కూడా అంక్షలు విధిస్తోంది. ఇలా బీజేపీ ఎన్నో ఆంక్షలు విధిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తుంది. కానీ, సీఎం కేసీఆర్ ప్రభుత్వం కార్మికుల పక్షాన అండగా నిలుస్తుంది.
-యాట కృష్ణ, కార్మిక సంఘం నేత, చౌటుప్పల్
నేతన్నల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
చేనేత కార్మికుల సంక్షే మం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. త్రిఫ్ట్ పథకం, యారన్ సబ్సిడీ, నేతన్న బీమా ఇలా పలు సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నది. దేశంలో ఎకడా ఇలాంటి పథకాలు లేవు.
కార్మికుల సంక్షేమ కోసం పథకాలు అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కింది.
-కేమ నీరజ, చేనేత కార్మికురాలు, భూదాన్పోచంపల్లి