నీలగిరి, ఆగస్టు 14: గాంధీ సినిమాను అన్ని పాఠశాలల విద్యార్థులు తల్లిదండ్రులు, ప్రజలు ఉచితంగా వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు ఈనెల 24 వరకు థియేటర్లలో ప్రదర్శన ఉంటుందని అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్ తెలిపారు. సోమవారం నల్లగొండ జిల్లా కేం ద్రంలోని వెంకటేశ్వర థియేటర్లలో గాంధీ చిత్రాన్ని ఆయన ఆర్డీఓ రవి, డీపీఆర్ఓ శ్రీనివాస్, ఎంఈఓ నర్సింహ, అరుంధతితో కలిసి ఆయన వీక్షించారు.
జిల్లాలోని చండూరు, మిర్యాలగూడ, దేవరకొండ, మాల్, నల్లగొండ, నాంపల్లిలోని థియేటర్లతో 6,255 మంది సోమవారం సినిమాను వీక్షించారని తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు ఉచితంగా చిత్ర ప్రదర్శన ఉంటుందని చెప్పారు.