యాదగిరిగుట్ట, డిసెంబర్ 15 : రాష్ట్ర ప్రభుత్వ విప్గా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నియమితులయ్యారు. గవర్నర్ తమిళి సై సౌందర్రాజన్ ఆయనను ప్రభుత్వ విప్గా నియమించగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కురుమ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిలయ్య ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గానికి చెందిన అయిలయ్యకు సముచిత స్థానం కట్టబెట్టింది. ప్రభుత్వ విప్గా నియమితులైన బీర్ల అయిలయ్య శుక్రవారం పలువురు మంత్రులను మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకారం, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు.. స్త్రీ శిశు సంక్షేమ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్కను హైదరాబాద్లో వేర్వేరుగా కలిశారు. వారికి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రసాదం, చిత్రపటాలను అందజేసి పలు అంశాలపై చర్చించారు.
చౌటుప్పల్ రూరల్, డిసెంబర్ 15 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దివీస్ పరిశ్రమ చేస్తున్న కృషి అభినందనీయమని దేవలమ్మనాగారం సర్పంచ్ కళ్లెం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని దేవలమ్మనాగారం జడ్పీహెచ్ఎస్, మండల పరిషత్ పాఠశాలలలో విద్యార్థులకు దివీస్ యాజమాన్యం సమకూర్చిన స్కూల్ బ్యాగులను ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉఫాధ్యాయులు, దివీస్ సిబ్బంది పాల్గొన్నారు.