కేతేపల్లి: నియోజకవర్గంలోని గ్రామాలను దశలవారీగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండ లంలోని గుడివాడ గ్రామంలో రూ.10లక్షలతో నూతనంగా నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాలు నిర్మాణ పనులను, రూ.20 లక్షలతో నిర్మించిన వైకుంఠధామం, పల్లెప్రకృతి వనాలను బుధవారం ఆయన ఆయన ప్రారంభించి మాట్లాడారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పల్లె ప్రగతిని ప్రవేశ పెట్టిందన్నారు. పేద ప్రజల కోసం సీఎం కేసీఆర్ ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి, ఉచిత విద్యుత్, రైతుబందు, రైతు భీమాను ప్రవేశపెట్టారని తెలిపారు.
దళితులకు సమాజంలో సముచితస్థానం కల్పించేందుకు దళితబంధు పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అన్నివర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నవ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రం ఏర్పాటైన ఏడేండ్లలో అభివృద్ధికి దారులు వేసినవ్య క్తి సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు. రాజకీయాలకతీతంగా అందరినీ కలుపుకొని పనిచేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.