సాగునీరు, 24గంటల ఉచిత కరంట్, రైతు బంధుతోపాటు పలు సంక్షేమ పథకాలతో వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని, నేడు యావత్ దేశం మొత్తం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో కలిసి పాల్గొని మాట్లాడారు. రాష్ర్టానికి బీజేపీ శనిలా మారిందని, తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న ఆ పార్టీని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని అన్నారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్తోపాటు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ తరహా పథకాల కోసం ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయని, అందుకే తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షపూర్తితంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు. సరైన నాయకుడు లేని పార్టీ కాంగ్రెస్ అని, దేశంలో, రాష్ట్రంలో ఆ పార్టీ సచ్చిపోయిందని అన్నారు. శాలిగౌరారం మండలంలోని జాలోనిగూడెం, మనిమద్దె గ్రామాల సర్పంచులు, వల్లాల ఎంపీటీసీతోపాటు సుమారు వెయ్యిమంది కాంగ్రెస్ నుంచి మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
శాలిగౌరారం, నవంబర్ 25 : సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా సాగు తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం శాలిగౌరారంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో కలిసి పాల్గొని మాట్లాడారు. బీజేపీ రాష్ర్టానికి శనిలా మారిందని, అభివృద్ధ్దికి ఆటంకం కలిగించే బీజేపీని తరిమికొట్టేందుకు ప్రజలు ఉద్యమించా ల్సిన అవసరం ఉందన్నారు. గుజరాత్, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ర్టాల ప్రజలు సీఎం కేసీఆర్ పాలనను కోరుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ సిరులు పండించేదిగా మారిందన్నారు.
దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సచ్చిపోయిందన్నారు.రాష్ర్టానికి బీజేపీ రూపంలో ప్రమాదం రాబోతుందని, తరి మికొట్టాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలే కనే కేంద్రంలోని బీజేపీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మంత్రి ఆరోపించారు.
రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ మాట్లాడుతూ నిత్యం ప్రజాసంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా నిలువాలన్నారు. అనంతరం మార్కెట్ చైర్పర్సన్గా మామిడి తేజస్వీని, వైస్ చైర్మెన్ గుజిలాల్ శేఖర్బాబుతోపాటు పాలకవర్గ సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించి అభినందించారు. వారంతా మంత్రికి నాగలిని బహుకరించారు. కార్యక్రమానికి ముందుగా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేకు టీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలో ఘనస్వాగతం పలికారు. ఎడ్లబండి ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు. టీఆర్ఎస్ తోరణాలు, ప్లెక్సీలతో మండల కేంద్రం అంతా గులాబీమమైంది.
కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కన్మంతరెడ్డి శశిధర్రెడ్డి, ఎంపీపీ గంట లక్ష్మమ్మ, జడ్పీటీసీ ఎర్ర రణీల, సర్పంచ్ హరిత, పీఏసీఎస్ చైర్మెన్ మురళి, వైస్ ఎంపీపీ అనిత, మార్కెట్ మాజీ చైర్మెన్ లక్ష్మి, శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకన్నగౌడ్, నాయకులు వెంకట్రెడ్డి, మామిడి సర్వయ్య, ఎంపీటీసీలు శంకర్రెడ్డి, చంద్రకళ, రాములు, సర్పంచ్ స్వప్నానరేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
శాలిగౌరారం, నవంబర్ 25 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందని, పార్టీని ముందుకు నడిపించే సత్తా వారికి లేదని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం శాలిగౌరారంలో మండలంలోని జాలోనిగూడెం, మనిమద్దె గ్రామాల కాంగ్రెస్ సర్పంచ్లు ఎస్కే ఖాసీంబీ, లింగాల కళమ్మ, వల్లాల ఎంపీటీసీ మాదగోని కవితారామలింగయ్య, మాజీ సర్పంచ్తో పాటు సుమారు వెయ్యి మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంత్రితోపాటు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మ్రంతి వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించి మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. మునుగోడులో బీజేపీకి ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టిన సంగతి తెలిసిందేనన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రజల పార్టీ పేర్కొ న్నారు. వారి వెంట పార్టీ రాష్ట్ర నాయకుడు కన్మంతరెడ్డి శశిధర్రెడ్డి, మండలాధ్యక్షుడు వెంకన్నగౌడ్, నాయకులు వెంకట్రెడ్డి, సర్వయ్య ఉన్నారు.