చందంపేట, ఏప్రిల్ 11 : బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం.. బలగమని పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. దేవరకొండ పట్టణంలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ చందంపేట మండల ఆత్మీయ సమ్మేళనంలో షీప్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పొగిళ్ల లిఫ్టు ఇరిగేషన్కు రూ.24.64కోట్లు, కంబాలపల్లి లిఫ్టు ఇరిగేషన్కు రూ.202.15కోట్లు మంజూరైనట్లు తెలిపారు. చందంపేట, నేరేడుగొమ్ము మండలాలకు డిండి ప్రాజెక్టు కాల్వల ద్వారా నీటిని అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతున్నదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధిలో దేశానికే రోల్మోడల్గా నిలిచిందని పేర్కొన్నారు. రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్లు, నిరంతర ఉచిత విద్యుత్, ఆడపిల్లల పెండ్లికి ఆర్థిక సాయం వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేస్తాయని షీప్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ అన్నారు. ప్రధాని మోదీని నిలువరించగల నాయకుడు, దేశాన్ని రక్షించగల నేత సీఎం కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరెక్కడా లేవని చెప్పారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి అనేక పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో జాతరను తలపించింది. పార్టీ చందంపేట మండలాధ్యక్షుడు ముత్యాల సర్వయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్రెడ్డి, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు దొండేటి మల్లారెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు బోయపల్లి శ్రీనివాస్గౌడ్, నాయకులు యాసాని రాజవర్ధన్రెడ్డి, టీవీఎన్ రెడ్డి, ఏర్పుల గోవిందుయాదవ్, రమావత్ మోహన్కృష్ణ, కేతావత్ శంకర్నాయక్, లక్ష్మణ్నాయక్, అనంతగిరి, మున్నయ్య, నర్సయ్య, శ్రీనివాస్, వెంకటయ్య, శంకర్రావు, రాములుగౌడ్, వీరారెడ్డి, కృష్ణ, రామకృష్ణ, మహాలక్ష్మయ్య, కొండల్రెడ్డి, నారాయణ, సయ్యద్ పాల్గొన్నారు.
-షీప్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజుయాదవ్