నల్లగొండ, మే 29 : పలు దుకాణాల్లో బ్లాక్లో విత్తనాలు విక్రయించడంతోపాటు విక్రయించిన వివరాలు ఎప్పడికప్పుడు రికార్డుల్లో నమోదు చేయకపోవడంతో వ్యవసాయ శాఖ విజిలెన్స్ బృందం బుధవారం నల్లగొండలోని ప్రకాశం బజార్లో ఇడుకుళ్ల నర్సయ్య దుకాణంలో ఆకస్మికంగా దాడులు నిర్వహించింది. స్టాక్కు, రికార్డుల్లో నమోదుకు తేడాలు ఉండడంతో అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించింది.
ఒక్కో పత్తి విత్తన ప్యాకెట్ను ఎమ్మార్పీ కంటే రూ.400-500 వరకు అధికంగా అమ్ముతున్నారని రైతులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ దాడులు చేశారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా విజిలెన్స్ డీఎస్పీ శ్రీకాంత్ హెచ్చరించారు. ఈ దాడుల్లో సీఐ గౌస్, ఏఓ శ్రీనివాస్, రాంబాబు, భవాని, శంకర్, నరసింహారెడ్డి, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.