బొడ్రాయిబజార్, ఫిబ్రవరి 9 : సూర్యాపేట మా ర్కెట్కు గురువారం రైతులు భారీగా ధాన్యం తీసుకొచ్చారు. దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరను నేపథ్యంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు మూడ్రోజుల పాటు సెలవు ప్రకటించారు. దాంతో మార్కెట్కు ధాన్యం పొటెత్తింది. 114మంది రైతులు 844 క్వింటాళ్ల ధాన్యా న్ని మార్కెట్కు తీసుకురాగా అధికారులు వెంటనే కొనుగోళ్లు చేసి మద్దతుకు మించి ధర చెల్లించారు. అధికంగా కంది 219 క్వింటాళ్లు రాగా క్వింటాకు రూ.7,263 ధర, 25 క్వింటాళ్ల వేరు శనగ రాగా క్వింటాకు రూ. 8,301 చెల్లించారు. పత్తి 54 క్వింటాళ్లు రాగా క్వింటా రూ.7,529 ధర చెల్లించారు. కంది, వేరుశనగ పంటలకు మంచి ధర పలుకుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వేరుశనగకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.5,850 ఉండగా బహిరంగ మార్కెట్లో అంతకు మించి పలుకుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కంది, వేరుశనగ పంటలకు రాష్ట్రంలోనే సూర్యాపేట మార్కెట్లో అత్యధిక ధర వస్తుండడంతో రైతులు సూర్యాపేట వ్యవసా య మార్కెట్కు అధిక సంఖ్యలో ధాన్యం తెచ్చి విక్రయిస్తున్నారని మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎండీ. ఫసియొద్దీన్ తెలిపారు. రైతులను, కమీషన్ దారులను నిత్యం పర్యవేక్షణ చేసుకుంటే ఇతర మార్కెట్ల్లో ధరలను పోల్చుకుంటూ రైతులకు మంచి ధర అందించేందుకు తాము చర్యలు తీసుకుంటున్నామన్నారు.