దేవరకొండ/చిలుకూరు/ఆగస్టు 28 : వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. సోమవారం పెద్దఅడిశర్లపల్లి మండలం వద్దిపట్లకు చెందిన 100 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన 50 మంది వివిధ పార్టీల నుంచి కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
– దేవరకొండ/చిలుకూరు/ఆగస్టు 28
చిలుకూరు, ఆగస్టు 28 : మండలంలోని బేతవోలు గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 50 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్దే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి పార్టీలో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారిలో నెమ్మాది రాణి, యాతాకుల పద్మ, సుగుణ, సైదమ్మ, రెమిడాల పరశురాములు, వెంకటి, గురుస్వామి, చింటు ఉన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ చంద్రకళ, మాజీ ఎంపీపీ బజ్జూరి వెంకట్రెడ్డి, నాయకులు శ్రీను, రామారావు, ఆంజనేయులు, పాల్గొన్నారు.