పెద్దఅడిశర్లపల్లి, జనవరి 20 : మండలంలోని పలు రేషన్ షాపుల్లో సివిల్ సప్లయ్ స్టేట్ టాస్క్ఫోర్స్, విజిలెన్స్ అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో కేశంనేనిపల్లి రేషన్ డీలర్ రాకేశ్పై 6ఏ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారి కమాల్పాషా మాట్లాడుతూ రేషన్ డీలర్లు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కొద్ది రోజులుగా పౌరసరఫరాల దుకాణాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రేషన్ డీలర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని జిల్లా అధికారులకు పలు ఫిర్యాదులు అందుతున్నట్లు సమాచారం. దీంతో వరుసగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో ఆర్ఐ అబీబ్, పుల్లయ్య, చారి పాల్గొన్నారు.