దేవరకొండ, అక్టోబర్ 6 : పార్టీలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఏస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పీఏపల్లి మండలం వద్దిపట్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో తాము కావాలని ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. పార్టీలో చేరిన వారు రూ.100 చెల్లించి సభ్యత్వ పొందాలని, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బీమా కింద బాధిత కుటుంబాలకు రూ.2లక్షలు అందుతాయని తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నాని చెప్పారు. ప్రతి నెలా గ్రామాలు, మున్సిపాల్టీల అభివృద్దికి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వల్లపురెడ్డి, రాయినబోని శ్రీనివాస్యాదవ్, ముసలయ్య, మాజీ సర్పంచ్ వెంకటయ్య, శ్రీను పాల్గొన్నారు
దేవరకొండ : ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరెలు మన సంస్కతి, సంప్రదాయయాలకు ప్రతీక అని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్భవన్లో మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. అనంతరం యువతకు స్పోర్ట్స్ కిట్స్ను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు మాధవరం సునీతాజనార్దన్రావు, వంగాల ప్రతాప్రెడ్డి, జడ్పీటీసీ కేతావత్ లాలునాయక్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కుంభం శ్రీనివాస్గౌడ్, నేనావత్ శ్రీను, మునగాల అంజిరెడ్డి, బీఆర్ఏస్ మండలాధ్యక్షుడు రమావత్ దస్రునాయక్ పాల్గొన్నారు.
మాల్ : చింతపల్లి మండలంలోని బట్టుగూడెం, కిష్టరాయినిపల్లికి చెందిన పేద కుటుంబాలకు జీఓ 58 కింద ఇండ్ల పట్టాలను శుక్రవారం ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్థలంలో తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి పూర్తి హక్కు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ జీఓను తీసుకొచ్చిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్రెడ్డి, తాసీల్దార్ మహ్మద్ శంశుద్ధిన్, డిప్యూటీ తాసీల్దార్ హర్షద్, ఆర్ఐ యాదయ్య, పాల్గొన్నారు.
దేవరకొండ : పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, డీఈఓ భిక్షపతి, ఆర్డీఓ శ్రీరాములు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీవీఎన్రెడ్డి, ఎంఈఓ మాత్రునాయక్, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
దేవరకొండ రూరల్ : బీఆర్ఎస్ పాలనలో గ్రామాలు ప్రగతి పథంలో పయణిస్తున్నాయని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మండలంలోని పడ్మట్పల్లిలో రూ.20లక్షలతో పల్లె దవఖాన, పాత్లావత్తండా(పి)లో రూ.20లక్షలతో పంచాయతీ భవనం, ధర్మతండాలో రూ.2.40కోట్లతో, ఎర్రబిచ్యతండాలో రూ.2కోట్లతో బీటీ రోడ్డు పనులు, కొండభీమనపల్లిలో రూ.5లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. కాసారంలో రూ.30లక్షలు, మైనంపల్లిలో రూ.45లక్షలు, మడమడకలో రూ.40 లక్షలు, అమ్మటోనిగూడెం లో రూ.20లక్షలు, చింతబావిలో రూ.30లక్షలు, తెలుగుపల్లిలో రూ.30లక్షలు, బుడ్డతండాలో రూ.30లక్షలతో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సలహాదారు మారుపాక సురేశ్గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్, పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీవీఎన్రెడ్డి, మునికుంట్ల వెంకట్రెడ్డి పాల్గొన్నారు.