మోత్కూరు: మండలంలోని దత్తప్పగూడెంకు ఈ నెల 28న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి జగదీశ్రెడ్డిలు రానున్నారని రాష్ట్ర ఆయిల్ ఫెఢ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి తెలిపా రు. ఆదివారం గ్రామంలోని రైతు వేదిక భవనాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రూ.22లక్షల నిధుల తో నిర్మాణం చేసిన రైతు వేదిక భవనాన్ని మంత్రులు నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మె ల్యే గాదరి కిశోర్కుమార్లు ప్రారంభోత్సవం చేయనున్నారని తెలిపారు.
రైతు వేదిక భవనం అన్ని హంగులతో నిర్మాణం పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతు మండలాధ్యక్షుడు కొండ సోంమల్లు, మండలాధ్యక్షుడు కొండ సోంమల్లు, గ్రామ కో అర్డినేటర్ ఎలుగు సత్తయ్య, గ్రామాధ్యక్షుడు కన్నెబోయిన సత్తయ్య, వార్డు సభ్యులు గనగాని యాదగిరి, ఎలుగు సోమయ్య, నాయకులు ఎలుగు సోమయ్య, గుండు యాదయ్య, మామిడి వెంకటేష్, బండి వెంకటేష్, ముక్కేర్ల నర్సింహ్మ పాల్గొన్నారు.