భూదాన్పోచంపల్లి, జులై8: చేనేత కార్మికులకు తెలంగాణ ప్ర భుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భువనగిరి ఎమ్మె ల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం నుం చి రూ. 5లక్షల బీమా కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం పై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం పోచంపల్లి పట్టణంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద సీఎంకేసీఆర్ చిత్రపటా నికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేనేతలను ఆదుకోవడా నికి చేనేత వస్ర్తాలకు విస్తృత ప్రచారం కల్పించి కార్మికులకు పని కల్పించడంతోపాటు కార్మికులకు ఆర్థిక పుష్టి కల్పించాలని థ్రి ఫ్తు పథకాన్ని ప్రవేశపెట్టి వారికి ఆర్థిక భద్రత కల్పించిన కేసీఆర్ ఎల్లప్పుడూ చేనేత కార్మికుల పక్షమేనన్నారు. అంతేకాకుండా కార్మికులకు చేనేత మిత్ర ధ్వారా 40శాతం యారన్ సబ్సిడీని అందించి పెట్టుబడిని తగ్గించిన ఘనత కూడా తెలంగాణ ప్రభు త్వానిదే అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా వారిని ఆదుకో వడానికి ప్రభుత్వం చేనేత వస్త్ర నిల్వలను టెస్కో ద్వారా కొను గోలు చేస్తున్నదని ఇప్పుడు చేనేత కార్మికులకు బీమా కూడా ప్రారంభించిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి, పద్మశాలీ చేనేత కార్మిక సంఘం అధ్య క్షుడు శ్రీహరి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు వెంకటేశం, నాయకు లు యాదగిరి, భాస్కర్, కిరణ్, శ్రవణ్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం
మోత్కూరు: రైతు బీమా తరహాలో చేనేత బీమా పథకం ద్వా రా చేనేత కార్మికులకు రూ.5లక్షలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆయన చిత్ర పటానికి చే నేత కార్మికులు క్షీరాభిషేకం నిర్వహించారు. గురువారం మో త్కూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో రహీం ఖాన్పేట మార్కండేయ చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే కిశోర్కుమార్ చిత్ర పటాలకు క్షీరాభి షేకం చేశారు. కార్యక్రమంలో చేనేత సంఘం అధ్యక్షుడు సత్య నారాయణ, చేనేత కార్మికులు రాములు, లక్ష్మయ్య, శ్రీనివా స్, నారాయణ, యాదగిరి, ఎన్నయ్య, సోమనారాయణ, పర శురాములు, జగ్గయ్య తదితరులు పాల్గొన్నారు.