వనపర్తి : వర్షం వల్ల ధాన్యం తడిసిపోతుందని ఇంటి నుంచి పొలం వద్దకు బైక్పై వెళ్తుండగా పిడుగు పడి ఓ రైతు మృతి చెందిన ఘటన పెద్దమందడిలో చోటుచేసుకుంది. పెద్దమందడి మండల కేంద్రానికి చెందిన తిరుపతి రెడ్డి (34) శనివారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..తన వ్యవసాయ పొలంలో వరి కోత పనులు జరుగుతున్నాయి.
వర్షం ప్రారంభం కావడంతో ధాన్యం వర్షం పాలవుతుందని ఇంటి నుంచి బైక్ పై పొలం వద్దకు వెళ్తుండగా బైక్ పై పిడుగు పడింది. చెరువు కట్ట సమీపంలో జరిగిన పిడుగుపాటుకు రైతు అక్కడికక్కడే మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు.
కాగా, పెద్దమందడి మండల కేంద్రంతో పాటు దొడగుంటపల్లి గ్రామాల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా పలువురు రైతులకు చెందిన ధాన్యం తడిసిడి ముద్దయింది.
ఇవి కూడా చదవండి..
తేనెటీగల దాడిలో గీత కార్మికుడి మృతి
కరోనాతో కొడుకు.. తట్టుకోలేక తండ్రి మృతి
అంబులెన్స్లో ప్రసవం..తల్లి, బిడ్డ క్షేమం
దళారుల బెడద అరికట్టేందుకే కొనుగోలు కేంద్రాలు
తెలంగాణలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు