సంస్థ ఆధ్వర్యంలో ముమ్మరంగా వ్యాక్సినేషన్
45ఏళ్లు పైబడిన కార్మికులు, వారి కుటుంబసభ్యులకు టీకాలు
రిటైర్డ్ సిబ్బందికి సైతం.. మహమ్మారిని అరికట్టేందుకు విశేష కృషి
ఏరియా దవాఖానలో ప్రత్యేక వార్డులు
ఫ్రంట్లైన్ వారియర్స్కు పీపీజీ కిట్లు, ఎన్95 మాస్క్లు, గ్లౌజ్లు
భూపాలపల్లి, ఏప్రిల్ 7: కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేప థ్యంలో సింగరేణిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నది. 45 సంవత్సరాలు పైబడిన కార్మికులు, వారి కుటుంబసభ్యులకు టీకాలు వేస్తున్నారు.
45 ఏళ్లు పైబడిన ఉద్యోగులు 3,573 మంది
భూపాలపల్లి సింగరేణి ఏరియాలో 45 ఏళ్లు పైబడిన ఉ ద్యోగులు 3,573 మంది ఉన్నారు. ప్రస్తుత, రిటైర్డ్ కార్మికులు, వారి కుటుంబసభ్యులు కలిపి 20 వేల మంది వరకు ఉంటార ని తెలుస్తోంది. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని డాక్టర్లు, వైద్యసిబ్బంది చెపుతున్నప్పటికీ చాలా మంది కార్మికులు, వారి కుటుంబసభ్యులు వెనుకంజ వేస్తున్నారు. వ్యాక్సినేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే భయం వారికి పట్టుకుంది. ఈ నెల 6 వరకు 45 సంవత్సరాలకు పైబడిన కార్మికులు, వారి కుటుంబసభ్యులు, ఫ్రంట్లైన్ వారియర్స్ కలిపి మొత్తం 797 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు.
కోలుకున్న వారు 814 మంది
భూపాలపల్లి సింగరేణి ఏరియాలో కరోనా వైరస్ ప్రారం భం నుంచి ఇప్పటి వరకు 821 మందికి సోకింది. ఇందులో 814 మంది పూర్తిగా కోలుకున్నారు. ఇద్దరు ఉద్యోగులు, ఐదు గురు కార్మిక కుటుంబసభ్యులు మృత్యువాత పడ్డారు.
సింగరేణి దవాఖానలో ప్రత్యేక వార్డులు
సింగరేణి ఏరియా దవాఖానలో కరోనా ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది. ఇందులో పురుషులకు 22 బెడ్స్, మహిళ లకు 18 బెడ్స్ ఉన్నాయి. వైరస్ సోకిన వారికి ప్రత్యేక మెను నూతో కూడిన పౌష్టికాహారాన్ని యాజమాన్యం అందిస్తోంది. ఉదయం 7 గంటలకు టిఫిన్, 11 గంటలకు కషాయం, మ ధ్యాహ్నం 12 గంటలకు పప్పు, కూరగాయలు, రెండు గుడ్లు తో భోజనం, సాయంత్రం 4 గంటలకు పసుపు వేసిన పాలు, రాత్రి పప్పు, కూరగాయలు, గుడ్లతో భోజనం ఇస్తున్నారు.
ప్రస్తుతం 22 యాక్టివ్ కేసులు
ప్రస్తుతం 22 మంది కరోనా బారిన పడగా, ఏరియా దవాఖా నలో వైద్యం అందిస్తున్నారు. ప్రతి రోజూ ఒకటి నుంచి ఏడు వరకు కేసులు వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇంకా సంస్థ హన్మకొండలో ఒకటి, హైదరాబాద్లో 14 కార్పొరేట్ దవాఖానలకు పంపించి మెరుగైన వైద్యం అందిస్తోంది.
ఇవి కూడా చదవండి..
కన్నుమూసి తెరిచేలోపు డ్రస్ మార్చేసిన మోడల్.. వీడియో
ఏసీలు, ఎల్ఈడీ లైట్ల కోసం పీఎల్ఐ పథకం