రామగిరి, మార్చి 30: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం ముగిశాయి. ఈ నెల 18న ప్రారంభమైన పరీక్షలు జిల్లావ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ముగియడంతో విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, మూల్యాంకనం ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు.
చివరి రోజు పరీక్షలు ముగిసిన తర్వాత విద్యార్థులు పరీక్ష కేంద్రాల వెలుపల తమ స్నేహితులతో కలిసి సంతోషం పంచుకున్నారు. హాస్టల్ విద్యార్థులు సామాన్లతో ఇంటి బాట పట్టారు. బస్టాండ్లు, పాఠశాలలు, హాస్టల్స్ వద్ద సందడి కనిపించింది.