కట్టంగూర్, డిసెంబర్ 9 : దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అని, భవిష్యత్లో దేశ్ కీ నేత సీఎం కేసీఆర్ కావడం ఖాయమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కట్టంగూర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరి ప్రవీణ్ ఆధ్వర్యంలో 100 మంది శుక్రవారం నకిరేకల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే చిరుమర్తి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు.
టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితిగా అమోదం పొందిన తరుణంలో వివిధ పార్టీల శ్రేణులు బీఆర్ఎస్లో చేరడం శుభసూచికమన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే మార్గదర్శకమన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్ పాలనకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు. పార్టీ కోసం పని చేసే వారికి సముచిత స్థానం కల్పించనున్నట్లు తెలిపారు.
అనంతరం పరడ గ్రామానికి చెందిన సూదిరెడ్డి లావణ్యకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 2.50 ఎల్ఓసీని అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, ఎంపీటీసీ పురుషోత్తంరెడ్డి, వెంకట్రెడ్డి, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు చౌగోని జనార్దన్, ఉప సర్పంచ్ అంతటి శ్రీను, ఉత్తరయ్య, వెంకటేశ్వర్లు, స్వామి, యాదయ్య, బాలసైదులు పాల్గొన్నారు.