నాగారం, ఫిబ్రవరి 10 : నాగారం మండలంలో ఇటీవల మరణించిన పలువురి కుటుంబాలను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి మంగళవారం పరామర్శించారు. నాగారం మండల పరిధిలోని డి.కొత్తపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు రావుల లింగమల్లు ఇటీవల మరణించడంతో ఆయన నివాసానికి వెళ్లి లింగమల్లు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం నాగారం మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ అటెండర్ ఎలుక హనుమంతు మంగళవారం మరణించడంతో ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఆయన వెంట తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కళ్లెట్లపల్లి ఉప్పలయ్య, బీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ కళ్లెట్లపల్లి శోభన్ బాబు, గుండగాని అంబయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు ఎల్క సైదులు, సంపేట అశోక్, మాజీ సర్పంచ్ యారాల నర్సింహా రెడ్డి, మండల నాయకులు చిప్పలపల్లి సోమయ్య, ఉప సర్పంచ్ వంగూరి అంజి, తీగుళ్ల యాదగిరి, ఆకారపు మధు పాల్గొన్నారు.