మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 19 : లాక్డౌన్ నేప థ్యంలో ఉదయం 10గంటల తర్వాత అనవసరంగా బయ టకు వస్తే చర్యలు తప్పవని ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్, పాన్చౌరస్తా, రాంమందిర్, క్లాక్టవర్ ప్రాంతా ల్లో లాక్డౌన్ పరిస్థితులను ఎస్పీ పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. లాక్డౌన్ సడలింపు సమయం లోగా దుకాణాదారులు తమ కార్యకలాపాలను పూర్తి చేసు కోవాలని, ఆపైన ఒక్క నిమిషం ఆలస్యమై నా నిబంధనల ఉల్లంఘనగా బావించి కే సులు నమోదు చేస్తామన్నారు. విపత్కర స మయంలో నిబంధనల ఉల్లంఘన చేయ డం బాధ్యతారహితం అవుతుందన్నారు. ఈ సందర్భంగా నమోదయ్యే కేసుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందన్న విషయం ప్రజలు గ్రహించాలని తెలిపారు. నిత్యావ సర సరుకుల కొనుగోలుకు వెసులుబాటు ఇచ్చిన సమ యంలో ఎవరికి వారు జా గ్రత్తలు తీసుకోవాలనే విష యాన్ని నిత్యం ఒక పాఠం లా చెప్పాలనుకోవడం సరై న విధానం కాదన్నారు.
భౌతికదూరం పాటించడంలో దుకాణా దారులతోపాటు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కొవిడ్ నిబంధనలు పాటిం చని వారిపై మరింత కఠినంగా వ్యవహ రి స్తూ కేసులు నమోదు చేయాలని అధికా రులను ఎస్పీ ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 3483 కేసులు నమోదు చే శామని, ఇందులో 171 దుకాణాదారులు ఉండగా, మా స్కులు ధరించని వారిపై 2153 కేసులు, అనవసరంగా వాహనాలపై తిరిగే వారిని గుర్తించి 1159 కేసులు నమో దు చేశామని ఎస్పీ వివరించారు. నమోదైన కేసులకు సం బంధించి బాధ్యులను న్యాయస్థానంలో హాజరుపర్చను న్నట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీధర్, వన్ టౌన్ సీఐ రాజేశ్వర్గౌడ్, పీఆర్వో రంగినేని మన్మోహన్ పాల్గొన్నారు.