తిమ్మాజిపేట, ఏప్రిల్ 30 : అకౌంట్లోని డబ్బులను తీసుకుందామని బ్యాం క్కు వెళ్లిన వ్యక్తి.. తన ఖాతాలో డబ్బులు లేవని తెలియడంతో నిర్ఘాంతపోయా డు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసిన ఘటన తిమ్మాజిపేట మం డలం అప్పాజిపల్లిలో చోటుచేసుకున్నది. ఎస్సై నరేందర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. అప్పాజిపల్లికి చెందిన రైతు బోయ వెంకటేశ్కు తిమ్మాజిపేట యూబీఐలో ఖాతా ఉన్నది. కాగా అతని అకౌంట్లో రూ.2.36లక్షలకు పైగా డబ్బులున్నాయి. అయితే అతడు ఏప్రిల్ 25న డబ్బులు తీసుకుందామని బ్యాంక్కు వెళ్లగా, ఖాతాలో డబ్బులు లేవని సిబ్బంది చెప్పడంతో అవాక్కయ్యాడు. వెంటనే బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోగా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 3 వరకు పలు దఫాలుగా అతని ఖాతా నుంచి మొత్తం నగదు వేరే అకౌంట్కు బదిలీ అయినట్లు గుర్తించారు. వెంకటేశ్ మొబైల్లో ఉన్న రెండు యూపీఐల ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు తెలిసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.