కొల్లాపూర్ రూరల్, ఏప్రిల్ 30 : ‘మీరు ఎందరికో అవకాశమిచ్చి పార్లమెంట్కు పంపారు కానీ.. మీ కలలను వారు నెరవేర్చలేదు.. అందుకే ఈసారి నన్ను ఆశీర్వదించి ఈవీఎంలో కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి.. ఢిల్లీ గడ్డపై మీ గొంతుకను వినిపిస్తాను’ అని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలను విస్మరించిందని, వారి సత్తా ఏంటో ఈ ఎన్నికల్లో చూపాలని ఆయన పిలుపునిచ్చారు. మాదిగల రాజకీయ ఐక్యవేదిక ఆధ్వర్యం లో ఫూలే, అంబేద్కర్, జగ్జీవన్రాం జయంతి ఉత్సాహల సందర్భంగా మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో ఎమ్మార్పీఎస్ నాయకుడు లక్ష్మయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్పీ హాజరై మాట్లాడుతూ.. తాను ఎంపీగా గెలిచాక పనిచేయకపోతే కొల్లాపూర్లోని అంబేద్కర్ చౌరస్తాలో రాళ్లతో కొ ట్టండన్నారు. కొం దరు దుర్మార్గులు, మోసగాళ్లు అమ్ముడుపోయినా.. మంగి విజయ్, మీసాల రామన్నలాంటి వారు అద్భుతంగా పనిచేస్తున్నారన్నారు. ఈక్రమంలో ఆర్ఎస్పీ మాట్లాడుతుండగా కరెంట్ పోయింది. దీంతో స్పందించిన ఆయన ‘నేను ఎప్పుడు మాట్లాడినా కరెంట్ పోతది.. ఇది కాం గ్రెస్ ప్రభుత్వ అసమర్ధత పాలన’ అని అసహనం వ్యక్తం చేశారు.
మన బిడ్డలు ప్రపంచంలో అగ్రగామిగా ఎదిగేందుకు తనను పార్లమెంట్కు పంపాలని.. అంత వరకు పాటల ద్వారా ఆమనగల్లు, కల్వకుర్తి, అచ్చంపేట ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజా చైతన్యం చేయాలని కవి, ప్రముఖ గాయకుడు గిద్దె రాంనర్సయ్యకు సూ చించారు. నాగర్కర్నూల్ జిల్లాలో నాలుగులక్షలమంది మాదిగలున్నారని గుర్తు చేశారు. ఎందరికో ఎంపీగా అవకాశమిస్తే వారంతా పదవులు పొంది ప్రజలను విస్మరించారని విచారం వ్యక్తం చేశారు. ఆడబిడ్డల కండ్లల్లో కన్నీటిని చూడలేక నెలకు రూ. 2.40లక్షల జీతాన్ని వదులుకొని రాజకీయాల్లో వ చ్చానన్నారు. గురుకులాల కార్యదర్శిగా ఆయన ఆ ధ్వర్యంలో ఉన్నత స్థాయికి ఎదిగిన పలువురు వి ద్యార్ధుల ఫొటోలు, వారి జీతాలను సభికులకు వివరించారు. ‘మీ బిడ్డలు నాలాగా ఎదగాలనుకుం టే మే 13న కారుగుర్తుకు ఓటేసి, వేయించి నన్ను గెలిపించండి’ అని అభ్యర్థించారు. బీజేపీ అభ్యర్థి భ రత్కు ఎలాంటి అనుభవం లేదని.. స్థానికేతరుడైన మల్లు రవికి రెండుసార్లు ఎంపీగా అవకాశమిస్తే ఇరగబెట్టిందేమీ లేదన్నారు. మన బిడ్డలు కూలీలు కా రాదని, చెప్పులు కుట్టే చేతులు చరిత్ర రాయాలన్నా రు. తనను గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృ షిచేస్తానన్నారు. అన్ని వర్గాలు సంఘటితమై తనను ఎంపీగా గెలిపించాలని కోరారు. అనంతరం కవి, గాయకుడు మీసాల రాము ఆర్ఎస్పీపై రచించి పా డిన పాటల సీడీని ఆవిష్కరించారు. సమావేశంలో విజయ్, మణ్యం తదితరులు ఉన్నారు.