లక్నో : ఐపీఎల్-17లో చెత్త ప్రదర్శనతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్కు మరోసారి భంగపాటు తప్పలేదు. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన ‘లో స్కోరింగ్ థ్రిల్లర్’లో రాహుల్సేనదే పైచేయి అయింది. లక్నో బౌలర్లు సమిష్టిగా రాణించడంతో.. తొలుత ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులకే పరిమితమైంది. వధేరా 46) ఆ జట్టును ఆదుకున్నాడు. అనంతరం ఛేదనలో లక్నో సైతం కష్టమ్మీదే గెలిచింది. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ స్టోయినిస్ (62) లక్నో విజయంలో కీలకపాత్ర పోషించాడు. లీగ్లో పది మ్యాచ్లు ఆడిన ముంబై ఏడు ఓటములు, మూడు విజయాలతో 9వ స్థానంలో ఉంది.
57/4. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై పది ఓవర్లకు చేసిన స్కోరు అది. రోహిత్శర్మ (4), సూర్యకుమార్ (10), తిలక్ వర్మ (7), పాండ్యా(0) చేతులెత్తేయడంతో 5.2 ఓవర్లకే ముంబై 4 వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది. వధేరా ఆచితూచి ఆడి ఆ జట్టును ఆదుకోగా ఆఖర్లో డేవిడ్ ( 35 నాటౌట్) మెరుపులు మెరిపించకుంటే ముంబై పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది.
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో కూడా కష్టంగానే గెలుపు దిశగా సాగింది. తొలి ఓవర్లోనే ఆ జట్టు ఓపెనర్ అర్షిన్ కులకర్ణి వికెట్ కోల్పోయింది. కెఎల్ రాహుల్ (28) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. దీపక్ హుడా (18) మళ్లీ విఫలమయ్యాడు. కానీ చెన్నైతో మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన స్టోయినిస్ లక్నోను మరోసారి ఆదుకున్నాడు. అయితే లక్నో విజయానికి 30 పరుగులు అవసరమనగా అతడు కూడా పెవిలియన్ చేరాడు. బదోని (6) సైతం రనౌట్ అయ్యాడు. కానీ పూరన్ (14 నాటౌట్), కృనాల్ (1 నాటౌట్) గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశారు.
ముంబై: 20 ఓవర్లలో 144/7 (నెహాల్ 46, డేవిడ్ 35నాటౌట్, మోహ్సిన్ 2/36, నవీనుల్ 1/15)
లక్నో: 19.2 ఓవర్లలో 145/6 (స్టోయినిస్ 62, రాహుల్ 28, హార్దిక్ 2/26, నబీ 1/16)