హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): మా ఆయిల్ రాస్తే పక్షవాతం కూడా మటుమాయం.. మా క్యాప్సుల్స్ వాడితే ఇట్టే లావు తగ్గిపోతారు.. అంటూ తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఔషధాలను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు సీజ్ చేశారు.
సోమ, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆరుచోట్ల దాడులు చేసినట్టు డీసీఏ అధికారులు తెలిపారు. ఆయా కంపెనీలపై కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.