వెల్దండ, జూన్ 8 : రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మె ల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం వెల్దండ మండలంలోని బర్కత్పల్లి గ్రామ సమీపంలో కేఎల్ఐ డీ-82 కాల్వ బ్లాస్టింగ్ పనులు, గాన్గట్టుతండాలో రూ.4.10కోట్లతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులను ఎమ్మె ల్యే పరిశీలించారు. ఇసుకబోర్డు తండాలో రూ.6లక్షలతో సీసీరోడ్డు పనులకు భూమిపూజ చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులతో కేఎల్ఐ కాల్వ పనుల పురోగతి, ధా న్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేఎల్ఐ కాల్వ నిర్మాణ పనులకు రూ.60కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరగా, సానుకూలంగా స్పందించారని తెలిపారు.
రైతుల నుంచి 85లక్షల మెట్రిక్టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. రైతులు పండించిన చివరి గింజవరకూ ప్ర భుత్వం కొనుగోలు చేస్తుందని, ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగంపై సవతితల్లి ప్రేమ చూపుతుందన్నారు. ఎఫ్సీఐ ద్వా రా ధాన్యం కొనుగోలుకు కేంద్రం ఏ మాత్రం సహకరించలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ సత్యనారాయణరెడ్డి, ఈఈ శ్రీకాంత్, డిప్యూటీ ఈఈ దేవన్న, ఎంపీపీ విజయ, జెడ్పీటీసీ విజతారెడ్డి, రైతుబం ధు సమితి మండల అధ్యక్షుడు భూపతిరెడ్డి, వైస్ఎంపీపీ శాంతి, కాంట్రాక్టర్ సూర్యనారాయణరాజు, సర్పంచులు బీరయ్య, పత్యానాయక్, వెంకటేశ్వర్రావు, అంజీనాయ క్, అంజయ్య, మాజీ ఎంపీటీసీ భీమయ్యగౌడ్, ఉపసర్పంచ్ నర్సింహ, నాయకులు జైపాల్నాయక్, గోపాల్నాయక్, నారాయణ, యాదగిరి, వెంకటేశ్, రమేశ్గౌడ్, లచ్చిరాం, యూత్ అధ్యక్షుడు రవిగౌడ్ పాల్గొన్నారు.