అచ్చంపేట: విద్యార్థులు లక్ష్యంతో ముందుకెళితేనే జీవితంలో రాణిస్తారని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. పట్ట ణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన స్వచ్ఛంద యువకుడు ఆది త్య ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కోనం నిర్వహించిన మాక్ అసెంబ్లీ ఆకట్టుకున్నది.
ముగింపు సమావేశంలో గువ్వల బాలరాజు మాట్లాడుతూ ఈ పాఠశాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి విద్యార్థులకు ప్రధానంగా ఏడు ఆంశాలపై అవగాహన, శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇక్కడ విద్యార్థులు నేర్చుకోని వాటి ద్వారా వచ్చే ఫీడ్ బ్యాక్ ద్వారా నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలకు వర్తింపజేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.
ఈ పాఠశాలలో విద్యార్థులకు ఎలక్షన్ లిట్రసీక్లబ్, ఆర్ట్స్క్లబ్, డిజిటల్ లిట్రసీ క్లబ్, వరల్డ్ లిట్రసీ క్లబ్, భవిష్యత్తు ఉన్నత విద్య అవకాశాలు కల్పించేందుకు ఏడు రకాల శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ శిక్షణలో విద్యార్థులు నేర్చు కున్న వాటి ఆధారంగా ఇతర పాఠశాలలను ఎంపిక చేస్తామన్నారు. తాను ఏడో తరగతిలోనే ఎమ్మెల్యే కావాలనే లక్ష్యం పెట్టుకోని సాధించామన్నారు. తాను నిరంతరం కష్టపడతానని, ప్రతిరోజూ 5గంటలే పడుకుంటానని చెప్పారు.
కష్టపడేతత్వం అలవాటు చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నారు. ఏదైనా 21రోజుల పాటు చేస్తే అదే అలవాటుగా మారు తుందన్నారు. తాను ఇప్పటికీ పీహెచ్డీ చేస్తున్నానని, ఇంకా చదువుతూనే ఉంటానని చెప్పారు. వలస కూలీ బిడ్డగా ప్రభుత్వ వసతి గృహల్లో చదివి పట్టుదల, కృషి, క్రమశిక్షణతో పనిచేయడం వల్ల ఈ స్థాయికి వచ్చినట్లు చెప్పారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మాక్ అసెంబ్లీలో గెలుపొందిన పార్టీ అభ్యర్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.