కొత్త రేషన్కార్డుల మంజూరు నిర్ణయంపై సర్వత్రా హర్షం
ఉమ్మడి జిల్లాలో 45,327 కుటుంబాలకు లబ్ధి
ప్రస్తుతం రేషన్ కార్డులున్న కుటుంబాలు 19,89,744
ప్రభుత్వ ఆదేశాలతో అధికారుల కసరత్తు
పెండింగ్ దరఖాస్తుల వివరాల సేకరణ
వరంగల్రూరల్, జూన్ 9(నమస్తేతెలంగాణ): రేషన్కా ర్డు కోసం దరఖాస్తు చేసిన అర్హులందరికీ పదిహేను రోజు ల్లోగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అర్జీ దారులు సంబురపడుతున్నారు. దీంతో అధికారులు రేషన్ కార్డుల కోసం తమ వద్ద పెండింగ్లో ఉన్న దరఖాస్తులను బుధవారం బయటకు తీశారు. పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి(డీఎస్వో), తహసీల్దార్, ఏఎస్వో, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లతోపాటు ఇతరుల వద్ద ఉన్న దరఖాస్తుల వివరాలను సేకరించారు. రేషన్కార్డుల కోసం వరంగల్ ఉమ్మడి జిల్లా లో 45,327 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు తేలింది. ప్రభుత్వ నిర్ణయంతో ఈ కుటుంబాలకు లబ్ధి చేకూరనుం ది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 10,89,744 రేషన్ కార్డు లు ఉన్నాయి.
జిల్లాల వారీగా.. వరంగల్ అర్బన్లో 2,66,056, రూరల్లో 2,19,245, మహబూబాబాద్ లో 2,35,432, జన గామలో 1,58,317, జయశంకర్ భూపాలపల్లిలో 1,21,378, ములుగులో 89,316 ఉన్న ట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. రేషన్ కార్డు గల ప్రతి కుటుంబంలో ఒకరిద్దరికంటే ఎక్కువ మంది సభ్యులు ఉండడం వల్ల ఈ 10,89,744 రేషన్ కార్డుల ద్వారా ఆరు జిల్లాల్లో 32,61,879 మంది లబ్ధి పొందుతున్నారు. ఇందులో వరంగల్ అర్బన్లో 8,09, 224, రూరల్లో 6,47,106, మహబూబాబాద్లో 7,05,078, జనగామలో 4,87,399, జయశంకర్ భూ పాలపల్లిలో 3,48,805, ములుగులో 2,64,267 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి ప్రతి నెల ప్రభుత్వం ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం అందజేస్తున్నది. కరోనా సమ యంలో పేదలకు అండగా నిలిచేందుకు రేషన్కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచితంగా బియ్యం ఇస్తున్నది. జూన్, జూలై కోసం ఈ నెల ఐదో తేదీ నుంచి రేషన్కార్డు ఉన్న ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి పదిహేను కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నది. కొత్త రేషన్ కార్డులు అందుకునే లబ్ధిదారులు కూడా నెలనెలా ప్రభు త్వం ఇచ్చే రేషన్ బియ్యంతోపాటు ఆపత్కాలంలో అంద జేసే ఉచిత బియ్యాన్నీ పొందే అవకాశం ఉంది.
పెండింగ్ దరఖాస్తులివే
రేషన్కార్డుల కోసం ఉమ్మడి జిల్లాలో దరఖాస్తులు పెం డింగ్లో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వీటిలో వరంగల్ అర్బన్లో 8,756, రూరల్లో 10,837, మహబూబాబాద్లో 7,918, జనగామలో 4,287, జయశంకర్ భూపాలపల్లిలో 4,398, ములుగులో 9,131 ఉన్నా యి. ఈ దరఖాస్తులు ఆయా జిల్లాలోని డీఎస్వో, తహసీ ల్దార్, ఏఎస్వోలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తదితరుల వద్ద పరిశీలన కోసం ఉన్నాయి. ఇప్పటికే కొన్ని దరఖాస్తులను ఓకే చేశారు. వరంగల్ రూరల్ జిల్లాలోని పెండింగ్ దరఖా స్తుల్లో 4,862 డీఎస్వో, 147 తహసీల్దార్, ఏఎస్వోలు, 2,589 రెవెన్యూ ఇన్స్పెక్టర్ల వద్ద ఉంటే 2,855 దరఖా స్తులకు అధికారులు ఆమోదం తెలిపారు.
వరంగల్అర్బన్ జిల్లాలోని 8,756 దరఖాస్తుల్లో 6,907 రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు, 247 తహసీల్దార్లు, 1,602 డీఎస్వో వద్ద పెం డింగ్లో ఉన్నట్లు సమాచారం. ములుగు జిల్లాలోని 9,131 దరఖాస్తుల్లో 4,963 డీఎస్వో, 3,475 రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, 524 తహసీల్దార్ల వద్ద పెండింగ్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోనూ రేషన్కార్డు దరఖా స్తులు డీఎస్వో, తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల వద్ద పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. కొత్త రేషన్కార్డుల మం జూరుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఆయా జిల్లా లోని ఉన్నతాధికారులు బుధవారం డీఎస్వో, తహసీ ల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల వద్ద ఉన్న పెండింగ్ దరఖాస్తుల వివరాలను సేకరించారు. ఆమోదం పొందిన దరఖాస్తుల సమాచారాన్ని కూడా తెలుసుకున్నారు. అర్హులకు పదిహే ను రోజుల్లోగా కొత్త రేషన్కార్డులను పంపిణీ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.