ములుగు, జూన్ 2(నమస్తేతెలంగాణ) : దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నేతృత్వంలో అన్ని రంగాల్లో అపూర్వ ప్రగతిని సాధిస్తూ స్వయం సమృద్ధి దిశగా పయనిస్తోందని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భగా జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశం గర్వించేలా సీఎం కేసీఆర్ తెలంగాణను ముందుకు నడిపిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయం ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, కూరగాయల మార్కెట్లో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మేర్గు సంతోష్యాదవ్, గ్రామ పంచాయతీలో సర్పంచ్ నిర్మల, డీఎఫ్వో కార్యాలయంలో డీఎఫ్వో ప్రదీప్కుమార్శెట్టి, డీఆర్వో కార్యాలయంలో కూతాటి రమాదేవి, వ్యవసాయ శాఖ కార్యాలయంలో డీఏవో గౌస్హైదర్, ప్రభుత్వ దవాఖానలో సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్వర్, డీఎంహెచ్వో కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య, పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఏఎస్పీ సాయిచైతన్య, ఓఎస్డీ కార్యాలయంలో శోభన్కుమార్, పోలీస్స్టేషన్లో సీఐ గుంటి శ్రీధర్, ఎస్సైలు ఓంకార్యాదవ్, డీవీ ఫణి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎస్ఆర్వో తస్లీమ్ మహ్మద్, ఎక్సైజ్ కార్యాలయంలో ఎస్సై భారతి, డీపీవో కార్యాలయంలో వెంకయ్య, డీఎల్పీవో కార్యాలయంలో దేవరాజు, సంక్షేమ భవనంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, పీఏసీఎస్ కార్యాలయంలో చైర్మన్ బొక్క సత్తిరెడ్డి, గాంధీపార్క్ వద్ద కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.