కుత్బుల్లాపూర్,జూలై15: అర్హులందరికీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అందిస్తున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని 75 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నిధుల కింద మంజూరైన చెక్కులను గురువారం చింతల్ క్యాంపు కార్యాలయం వద్ద అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ.. అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న స్వరాష్ట్రంలో పేద, మధ్యతరగతి కుటుంబాలందరికి సమన్యాయంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ తన పాలనతో దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అమలుకాని పథకాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడపకు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సురేశ్రెడ్డి, పార్టీ నాయకుడు మహ్మద్ రఫీతో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.
జీడిమెట్ల,జూలై15: సుభాష్నగర్ డివిజన్ పరిధిలో కేకే సొసైటీ జీడిమెట్ల ఇండస్ట్రియల్ పార్క్ ఫేస్-5 ఎక్సన్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గురువారం ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గుడిమెట్ల సురేశ్రెడ్డి, మాజీ కౌన్సిలర్ రంగారావు, అసోసియేషన్ అధ్యక్షుడు రమణ, ఉపాధ్యక్షుడు బెంజమిన్, నాయకులు అడప శేషు, శ్రీకాంత్, శ్రీనివాస్రాజు, భద్రప్ప, ఇస్మాయిల్, శ్రీను, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఫాక్స్సాగర్ చెరువు వద్ద ప్రత్యేకంగా నిర్వహించిన పూరి జగన్నాథ్ స్వామి పూజల్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.