పీర్జాదిగూడ, జూలై 24 : ఆపద సమయంలో ఆదుకునే ఆపద్బాంధవుడు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతా ల్లో శనివారం ముక్కోటి వృక్షార్చన, గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతో నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడుగా కేటీఆర్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఆయన దీక్షా దక్షత వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా తరలివస్తున్నాయన్నారు. దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలవడంలో కేటీఆర్ పాత్ర ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలో కేటీఆర్ జన్మదినం సందర్భంగా మేయర్ జక్క వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో సాయిప్రియ కాలనీలో మంత్రి మొక్కలు నాటారు. డిప్యూటీ మేయర్ శివకుమార్గౌడ్, కార్పొరేటర్లు సుభాష్నాయక్, అనంతరెడ్డి, హరిశంకర్రెడ్డి, శారద ఈశ్వర్రెడ్డి, మంజుల రవీందర్, నాయకులు శ్రీధర్రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, రవీందర్ పాల్గొన్నారు. అలాగే గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా మేయర్ ప్రత్యేకంగా ముద్రించిన నోట్బుక్స్ను విద్యార్థులకు మంత్రితో కలిసి పంపిణీ చేశారు.
శామీర్పేట : తూంకుంట మున్సిపాలిటీలో ఫారెస్ట్, మున్సిపల్శాఖల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా 50 మంది దివ్యాంగులకు వాహనాలు అందజేయనున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి రాజశేఖర్రెడ్డి, చైర్మన్ రాజేశ్వర్రావు, వైస్ చైర్మన్ వాణివీరారెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్ : దమ్మాయిగూడ మున్సిపాలిటీలో మంత్రి మల్లారెడ్డి మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకు మందు కేక్ కట్ చేసి, పంచి పెట్టారు. కార్యక్రమంలో మర్రి రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, కమిషనర్ స్వామి, వైస్ చైర్మన్ నరేందర్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఘట్కేసర్ : పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మంత్రి మల్లారెడ్డి , చైర్మన్ కొండల్రెడ్డి నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. వైస్ చైర్మన్ రెడ్యానాయక్, కమిషనర్ సురేశ్, టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేందర్రెడ్డి, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘట్కేసర్,జూలై24 : మున్సిపాలిటీల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ నిధులు రూ.14 లక్షలతో ఏర్పాటు చేసిన వైకుంఠ రథాన్ని మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. వైస్ చైర్మన్ రెడ్యానాయక్, కమిషనర్ సురేశ్, మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, కౌన్సిలర్లు బి.హరిప్రసాద్రావు, వెంకటేశ్ గౌడ్, రాజశేఖర్, సాయిరెడ్డి, బాల్రెడ్డి, మహేశ్, రవీందర్, సుధాలక్ష్మి,నాయకులు పాల్గొన్నారు.