దుండిగల్: కార్మికుల సంక్షేమమే ధ్యేయమని టీఆర్ఎస్కేవీ రాష్ట్ర నాయకులు,శ్రమశక్తి అవార్డు గ్రహీత ముద్దాపురం మదన్గౌడ్ అన్నారు. నేపాల్కు చెందిన బోలాసాహూ(45) అనే వ్యక్తి తన కుటుంబసభ్యులతో కలిసి కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సుభాశ్నగర్లో నివాసముంటున్నాడు. అతను ఓ పరిశ్రమలో కార్మికుడుగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నాడు. అయితే ఆగస్టు7వ తేదీన రోజుటిలాగానే బోలాసాహూ విధులకు హాజరయ్యాడు. విధుల్లో ఉండగా బోలాసాహూ కాలుజారి కిందపడడంతో అతనికి తీవ్రగాయాలు కాగా చికిత్స కోసం పరిశ్రమ యాజమాన్యం వైద్యశాలకు తరలించి చేతులు దులుపుకుంది.
చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత బోలాసాహూ చికిత్స పొందుతూ వైద్యశాలలో మృతిచెందాడు. అయితే బోలాసాహూ మృతితో వీధినపడ్డ అతని కుటుంబం తమను ఆదుకోవాలని కార్మికనాయకులు ముద్దాపురం మదన్గౌడ్ను కలిసి విజ్ఞప్తి చేసింది. దీంతో స్పందించిన మదన్గౌడ్ పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి మృతుడి కుటుంబానికి రూ.6 లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదిర్చారు.
ఇందుకు సంబంధించిన మొత్తాన్ని మంగళవారం మృతుడి కుటుంబసభ్యులకు షాపూర్నగర్లోని మదన్గౌడ్ నివాసంలో అందజేశారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు మదన్గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికసంఘాల నేతలు సుభాశ్, రాంబాబు, కిరణ్, నందుగుప్త, బాబు, శివకుమార్, చందర్ తదితరులు పాల్గొన్నారు.